BigTV English

Bus catches fire in Haryana: హర్యానాలో ఘోరం, మంటల్లో బస్సు.. 10మంది సజీవ దహనం

Bus catches fire in Haryana: హర్యానాలో ఘోరం, మంటల్లో బస్సు.. 10మంది సజీవ దహనం

Bus catches fire in Haryana: హర్యానాలో ఘోరం జరిగింది. నుహ్‌కు సమీపంలోని ఓ టూరిస్టు బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దాదాపు పది మంది సజీవ దహనమయ్యారు. దాదాపు 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఘటన సమయంలో బస్సులో 64 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైనవారులో ఎక్కువగా పంజాబ్, చండీగఢ్ వాసులు ఉన్నారు.


అసలేం జరిగింది? డీటేల్స్‌‌లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి 60 మంది భక్తులతో ఓ టూరిస్టు బస్సు హర్యానా వైపు వస్తోంది. వీరంతా ఉత్తరప్రదేశ్‌లోని మధుర, బృందావనం యాత్రకు ముగించుకుని తిరిగి వస్తున్నారు. శుక్రవారం అర్థరాత్రి ఒంటిగంటన్నర మధ్యలో హర్యానాలోని నుహ్‌ సమీపానికి బస్సు చేరుకుంది.

కుండలి- మనేసర్-పల్వాల్ ఎక్స్‌‌ప్రెస్ వేకి వచ్చింది. అర్థరాత్రి కావడంతో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. మరి ఏమైందో తెలీదుగానీ బస్సులో మంటలు వ్యాపించాయి. దాదాపు 10 మంది భక్తులు సజీవ దహనమయ్యారు. అందులో ప్రయాణిస్తున్నవారు పంజాబ్, హర్యానా ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. 20 మందికి పైగా గాయపడ్డారు. చాలామంది కాలిపోయారు. మరికొందరు స్థానికుల సహాయంతో బయట పడ్డారు.


గాయపడినవారిని నుహ్‌ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన విషయం తెలియగానే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటనపై నుహ్ ఎమ్మెల్యే అఫ్తాబ్ విచారం వ్యక్తంచేశారు.

బస్సు వెళ్తున్న సమయంలో మంటలు అంటుకున్నాయి. సమీపంలోని గ్రామస్తులు బస్సు ఆపాలని కేకలు వేసినా డ్రైవర్ ఆపలేదు. ఆ తర్వాత టూ వీలర్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు బస్సును వెంబడించి మంటలు చెలరేగిన విషయాన్ని డ్రైవర్‌కు చెప్పారు. బస్సు ఆగినప్పటికే మంటలు దాదాపు చుట్టుముట్టాయి.

ALSO READ: ఆప్‌లో చీలిక ఖాయమా? స్వాతి మలివాల్ కేసులో న్యూట్విస్ట్!

మంటలను అదుపులోకి తెచ్చేందుకు స్థానికులు శతవిధాలా ప్రయత్నం చేశారు. ఈ ఘటన సమయంలో ఎక్స్‌ప్రెస్ వేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. మొత్తానికి పోలీసులు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

Tags

Related News

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

Big Stories

×