E-Paper
Advertisement

Man kills Mother and Daughters : ఆస్తి తగాదా.. తల్లి, కూతుళ్లను చంపిన కిరాతకుడు

Man kills Mother and Daughters : ఆస్తి తగాదా.. తల్లి, కూతుళ్లను చంపిన కిరాతకుడు
Advertisement

Man kills Mother and Daughters for Asset : మంచికి, మానవత్వానికి రోజుల్లేని జనరేషన్ ఇది. చిన్న చిన్న కారణాలకే అయినవారిని అనంతలోకాలకు పంపుతున్నారు. ఆస్తి తగాదాలు, అనుమానాలు, ప్రేమలు, కులాంతర – మతాంతర వివాహాలు.. ఇలా రకరకాల కారణాలతో ఎందరో హత్యకు గురవుతున్నారు. ఆస్తికోసం కన్న తల్లిని, కడుపున పుట్టిన ఇద్దరు కూతుళ్లను కడతేర్చాడో కసాయి తండ్రి. ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపేట గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి తన తల్లి పిచ్చమ్మ (60)తో ఆస్తి తగాదాలున్నాయి. ఈ క్రమంలోనే కోపంతో తల్లిని గొంతు నులిమి హతమార్చాడు. ఆపె ఇద్దరు కూతుళ్లు నీరజ (10), ఝాన్సీ(6)లను కూడా చంపి పరారయ్యాడు. తల్లి పేరుపై ఉన్న పొలంను తన పేరుపై రాయాలని కొన్నాళ్లుగా వేధిస్తున్నట్లు తెలిసింది. అందుకు ఆమె ససేమిరా కుదరదని చెప్పడంతో.. వెంకటేశ్వర్లు ఈ దారుణానికి ఒడిగట్టాడు.

Advertisement

Also Read : భర్తను చంపేసి, హార్ట్ ఎటాక్ అంటూ.. అడ్డంగా బుక్కైన వైఫ్

కాగా.. స్థానికులు చెప్పిన దానిప్రకారం వెంకటేశ్వర్లుకు ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉంది. రెండేళ్ల క్రితం భార్యను కూడా అతనే చంపినట్లు పోలీసులకు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపిన పోలీసులు.. హత్యలపై కేసు నమోదు చేసి.. పరారీలో ఉన్న వెంకటేశ్వర్లు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×