BigTV English

High Tension in Delhi: నిరసనతో అట్టుడుకుతున్న దేశ రాజధాని.. తగ్గేదేలే అంటున్న రైతులు!

High Tension in Delhi: నిరసనతో అట్టుడుకుతున్న దేశ రాజధాని.. తగ్గేదేలే అంటున్న రైతులు!

Farmers Protest in Delhi: దేశ రాజధాని ఢిల్లీ రైతుల ఆందోళనతో అట్టుడుకుతోంది. కేంద్రం గతంలో ఇచ్చిన డిమాండ్లను నెరవేర్చాలని కోరతూ ఢిల్లీ చలోకి పిలుపునిచ్చారు. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల రైతులంతా దేశ రాజధానికి ర్యాలీగా బయల్దేరగా.. పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఈ ఉదయం పంజాబ్‌, హరియాణా నుంచి వేలాదిమంది రైతులు ట్రాక్టర్లతో నగరానికి తరలి వచ్చారు. ఈ క్రమంలో కొన్ని కీలక విషయాలు వెల్లడైనట్లు చమాచారం.


ఇటీవలే వెలుగులోకి వచ్చిన నివేదిక ప్రకారం ఒక్క పంజాబ్ నుంచే అధిక సంఖ్యలో రైతులు కదిలి వచ్చారు. రైతులతో పాటు ట్రాక్టర్లు, వాహనాలలో ఆరు నెలలకు సరిపడా ఆహారం సామగ్రిని తిసుకొచ్చారని సమాచారం. మీడియాతో మాట్లాడిన కొందరు రైతులు ఈ విషయాలు వివరించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేవరకు నిరసన కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం, పోలీసులు తమ సహనాన్ని పరీక్షించినా తము వెనక్కి తగ్గమన్నారు.

నిరసనలో రైతులు మీడియాతో మాట్లాడుతూ.. ‘ మా డిమాండ్లు నెరవేర్చేవరకు నిరసన జరుగుతుంది. ఆరు నెలలకు సరిపడ సమాగ్రితో మేము ఇక్కడికి కదిలి వచ్చాము. సుత్తి, రాళ్లను పగలకొట్టే పరికరాలు మా ట్రాలీల్లో ఉన్నాయి’ అని వెల్లడించారు. నిరసనకు తరలివస్తున్న తమను అడ్డుకుంనేందుకు ట్రాక్టర్లకు డీజిల్ దొరక్కుండా చేస్తున్నారని రైతులు ఆరోపనలు చేశారు. రెండు ట్రాలీల్లో సామగ్రిని తీసుకొని పంజాబ్ గురుదాస్‌పూర్ నుంచి ఢిల్లికి వచ్చామన్నారు.


2020-21లో ఉద్యమానికి వచ్చిన రైతులు ప్రస్తుతం ఈ నిరసనలో పాల్లొంటున్నారు. అప్పట్లో వారు కొన్ని నెలల పాటు చలిని సైతం లెక్క చేయకుండా ఢిల్లీలో ఆందోళనలు చేపట్టారు. కేంద్రం ఇచ్చిన హామీలను నెలవేర్చలేదని.. ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చేదాకా చలో ఢిల్లీ నిరసన యథాతథంగా కొనసాగుతుందని రైతు నాయకులు తేల్చి చెప్పారు.

Related News

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Big Stories

×