E-Paper
Advertisement

Uttarpradesh Crime : అనుమాన భూతం.. భార్య, పిల్లల్ని చంపి.. మూడురోజులుగా..?

Uttarpradesh Crime : అనుమాన భూతం.. భార్య, పిల్లల్ని చంపి.. మూడురోజులుగా..?
Advertisement

Uttarpradesh Crime News

Uttarpradesh Crime News(News update today in telugu): అనుమానం.. అనే పెను భూతం ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. భార్య, భర్తల మధ్య ఘర్షణలో పిల్లలు అనాధలుగా మిగిలిపోయిన ఘటనలెన్నో ఉన్నాయి. సమస్యేదైనా ఉంటే.. కూర్చుని మాట్లాడి పరిష్కరించుకోవాల్సింది పోయి.. క్షణికావేశంలో ప్రాణాలు తీసేస్తున్నారు. ఆ తర్వాత జైలు పాలయ్యి.. జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. అనుమానంతో భార్య ఇద్దరు పిల్లల్ని హతమార్చాడు.

Advertisement

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌతమ్ అనే వ్యక్తి లఖ్ నవూలోని బిజ్నోర్ ప్రాంతంలో తన భార్య జ్యోతి (36), కుమార్తె (6), కుమారుడు (9)తో కలిసి ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అయితే ఇటీవల గౌతమ్ – జ్యోతిలకు తరచూ గొడవలు అవుతుండేవి. జ్యోతికి మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందన్న గౌతమ్ అనుమానం రోజురోజుకూ బలపడుతూ వచ్చింది. మూడ్రోజుల క్రితం కూడా వీరి మధ్య ఇదే విషయమై తీవ్ర వాగ్వాదం జరిగింది. మాట మాట పెరగడంతో జ్యోతి మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు గౌతమ్.

Also Read : కడుపులో కొకైన్ క్యాప్సూల్స్.. వాటి విలువ రూ.11 కోట్లు..

Advertisement

ఆపై పిల్లల్ని కూడా గొంతునులిమి హతమార్చాడు. మూడురోజులుగా మృతదేహాలను ఇంట్లోనే ఉంచుకున్నాడు. షరా మామూలుగా వాళ్ల పక్కనే పడుకొని.. మర్నాడు ఉదయం పనికి వెళ్లేవాడు. అయితే ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గమనించిన స్థానికులు.. గౌతమ్ లేని సమయంలో తలుపును పగలగొట్టి చూశారు. ముగ్గురూ శవాలుగా పడి ఉండటాన్ని చూసి నిర్ఘాంతపోయారు. పోలీసులకు సమాచారమివ్వగా.. వారు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కు తరలించారు. నిందితుడైన గౌతమ్ ను అదుపులోకి తీసుకున్నారు.

Related News

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Big Stories

Advertisement
×