E-Paper
Advertisement

Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు వర్షాలు

Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు వర్షాలు

Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న రెండు రోజులు పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, కేరళ, ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

ఇదిలా ఉంటే కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ పలు హెచ్చరికలను జారీ చేసింది. రుతుపవనాల ప్రభావంతో రానున్న రెండు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మహారాష్ట్ర – కేరళ తీరం వెంబడి ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. మధ్య గుజరాత్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లిడించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆరు జిల్లాల్లోని పాఠశాలలను మూసివేశారు.

తెలంగాణలో అల్పపీడనం ప్రభావంతో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల పల్లి, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్ , ఆదిలాబాద్, నిజామాబాద్ తో పాటు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. శుక్రవారం నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, జయంశంకర్ భూపాల్ పల్లి, కరీంనగర్  సిద్దిపేట్, సిరిసిల్ల, జనగామతో పాటు పలు జిల్లాలోని వర్షాలు కురిసాయి.

Also Read: భారీ వర్షానికి కూలిన పై కప్పు.. ముగ్గురు చిన్నారులు మృతి

అల్పపీడనం, రుతుపనాలు చురుకుగా కదులుతుండటంతో ఉత్తర కోస్తా ప్రాంతానికి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 55 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. అంతే కాకుండా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. రానున్న రెండు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×