E-Paper
Advertisement

Nagpur Temperature: నాగ్‌పుర్‌ ఉష్ణోగ్రతపై వాతావరణ శాఖ క్లారిటీ

Nagpur Temperature: నాగ్‌పుర్‌ ఉష్ణోగ్రతపై వాతావరణ శాఖ క్లారిటీ

Nagpur Temperature: దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అనేక రాష్ట్రాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో ఇటీవల 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ శాఖ మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ లో శుక్రవారం 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రత నమోదు కావడంతో వాతావరణ శాఖ అధికారులు రీసెర్చ్ చేసి అది నిజం కాదని తేల్చి చెప్పారు.

ఉష్ణోగ్రత నమోదు కావడంతో సెన్సార్ సరిగా పనిచేయడం లేదని స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉంటే నాగ్ పూర్ లో భారత వాతావరణ విభాగం నాలుగు ఆటోమెటిక్ వెదర్ స్టేషన్ లను ఏర్పాటు చేసింది. అయితే అందులోని రెండు అసాధారణ ఉష్ణోగ్రతలను నమోదు చేశాయి. సోనేగానంలోని ఏడబ్ల్యూఎస్ స్టేషన్ లో ఉష్ణోగ్రత 56 డిగ్రీలు నమోదవగా ఉత్తర అంబాజరీ రోడ్డులోని ఐఎండీ కేంద్రంలో అత్యధికంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Also Read: ఢిల్లీలో నీటి సంక్షోభం, చేతులు జోడించి సీఎం అభ్యర్థన, ఆపై కోర్టుకు

మిగతా రెండు స్టేషన్లలో మాత్రం 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే సైట్ పరిస్థితులు, సెన్సార్ కవచాలు వంటివి దెబ్బతినడంతో పాటు వివిధ కారణాల వల్ల ఆటోమేటిక్ సిస్టమ్ తప్పు రీడింగ్ చూపించవచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రత నాగ్ పుర్ లో నమోదైందన్న వార్త దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×