BigTV English

Water Crisis in Delhi: ఢిల్లీలో నీటి సంక్షోభం, చేతులు జోడించి సీఎం అభ్యర్థన, ఆపై కోర్టుకు

Water Crisis in Delhi: ఢిల్లీలో నీటి సంక్షోభం, చేతులు జోడించి సీఎం అభ్యర్థన, ఆపై కోర్టుకు

Water Crisis in Delhi: నీటి కోసం యుద్ధాలు మొదలవుతున్నాయా? భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు తప్పవని చాలా మంది మేధావులు చెప్పారు. ఇప్పటికే ఆఫ్రికాను వాటర్ క్రైసిస్ వెంటాడుతోంది. ఇదంతా ఇప్పట్లో కాదని దేశంలోని పలు ప్రభుత్వాలు లైట్‌గా తీసుకున్నాయి. మేధావులు చేసిన హెచ్చరికలను పెద్దగా పట్టించుకోలేదు. దాని ఫలితమే.. నిన్న కోల్‌కత్తా, బెంగళూరు.. నేడు ఢిల్లీ.


ఉత్తరాదిలో ఈసారి ఎండలు ఠాకెత్తించాయి. ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో 45 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుంది. రోడ్డు మీదకు ప్రజల రాలేక నానావస్థలు పడ్డారు. ఎండల ప్రభావం నీటిపై పడింది. దేశ రాజధాని ఢిల్లీలో నీటి కొరత తీవ్రమైంది.

వీధుల్లోకి వాటర్ ట్యాంకులు వస్తే చాలు నీటి చుక్కను ఒడిసి పట్టుకోవడానికి నానాప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో ప్రజలు కొట్టుకుంటున్న సందర్భాలు లేక పోలేదు. ప్రస్తుతం ఢిల్లీ అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. పరిస్థితి గమనించిన ఆప్ సర్కార్, నీటి వృధాను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది.


ముఖ్యంగా వాహనాలు కడిగితే భారీ మొత్తం జరిమానా వేసేందుకు వెనుకాడలేదు. నీటిని వాణిజ్యం కోసం ఉపయోగించే ఊరుకునేది లేదని హెచ్చరించింది. ముఖ్యంగా నిర్మాణాలు జరిగే ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలు వంటి ప్రాంతాల్లో అక్రమంగా ఉన్న నీటి కనెక్షన్లను నిలిపివేయాలని ఢిల్లీ మంత్రి అధికారులను ఆదేశించారు. ఎండల తీవ్రత కారణంగా ఢిల్లీకి హర్యానా నుంచి రావాల్సిన నీటి సరఫరా ఆగిపోవడంతో ఈ సమస్య తలెత్తిందని అధికారులు చెబుతున్నమాట.

ఢిల్లీలో తలెత్తిన నీటి సంక్షోభంపై కేజ్రీవాల్ సర్కార్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. హర్యానా, యూపీ ప్రభుత్వాలు తమకు అదనపు నీళ్లు కేటాయించేలా ఆదేశాలివ్వాలని అందులో ప్రస్తావించింది. మరోవైపు ప్రస్తుత పరిస్థితిపై సీఎం కేజ్రీవాల్ రియార్ట్ అయ్యారు. ఎండల కారణంగా ఢిల్లీలో విద్యుత్ వినియోగం పెరిగిందని, అయినా ఎక్కడా కొరత లేదన్నారు. అధిక ఎండల కారణంగా నిటి వినియోగం పెరిగింది.

ALSO READ: గోల్డ్ స్మగ్లర్లు కొత్త ఎత్తులు, బుక్కైన ఎయిర్‌హోస్టెస్, బంగారాన్ని…

సరిహద్దు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి సరఫరా తగ్గిపోయింది. దీనిపై అందరూ కలిసి నీటి సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపు ఇచ్చారు. రాజకీయాలు పక్కనబెట్టి నీటి సమస్య నుంచి ఢిల్లీ ప్రజలకు ఉపశమనం కలిగించాలని చేతులు జోడించి కోరారు. అందరం కలిసి పనిచేస్తే హస్తిన వాసుల కష్టాలు తగ్గుతాయని పేర్కొన్నారు. గత ఏప్రిల్ నెలలో బెంగుళూరు, కోల్‌కత్తాలో ఇదే పరిస్థితి నెలకొంది. కాస్త వర్షాలు పడడంతో కొంత ఉపశమనం కలిగింది.

 

Tags

Related News

UP News: విద్యా అధికారిపై కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Big Stories

×