E-Paper
Advertisement

India- China: అరుణాచరల్ ప్రదేశ్ పై చైనా మొండి వాదన.. భారత్‌ కౌంటర్‌..

India- China: అరుణాచరల్ ప్రదేశ్ పై చైనా మొండి వాదన..  భారత్‌ కౌంటర్‌..
Advertisement
India- China
India- China

India- China: అరుణాచల్ ప్రదేశ్ పై చైనా కుట్రలు ఆగడంలేదు. దక్షిణ టిబెట్.. జాంగ్నాన్  తమదేనని మొండి వాదన చేస్తోంది. ఆ భూభాగం తమ దేనని ఆ దేశ రక్షణశాఖ అధికార ప్రతినిధి సీనియర్ ఝాంగ్ షియాంగాంగ్ అన్నారు. చైనా వాదనకు భారత్ ధీటుగా బదులిచ్చింది. అరుణాచల్ భారత్ లో అంతర్భాగమని తేల్చిచెప్పింది. ఆధారాలు లేకుండా మాట్లాడితే.. వాస్తవాలు మారవని చైనాకు బదులిచ్చింది.

జాంగ్నాన్ ప్రాంతంపై చైనా రక్షణశాఖ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. మళ్లీ మళ్లీ చైనా నిరాధార వాదనలు చేస్తోందని మండిపడింది. జాంగ్నాన్ ప్రాంతంలో భారత్ లోనిదేనని స్పష్టం చేసింది. అక్కడ భారత్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్తి చేసిన విషయాన్ని ప్రస్తావించింది. ఈ అభివృద్ధి పనుల వల్ల జాంగ్నాన్ ప్రాంత ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయని భారత్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ ప్రకటించారు.

Advertisement

భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో సేలా సొరంగ మార్గాన్ని ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభోత్సవం చేశారు. అక్కడికి సైనిక బలగాలు, ఆయుధాలను తీసుకెళ్లేందుకు ఈ మార్గం ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో చైనా మొండి వాదనలు మొదలుపెట్టింది.

Also Read :  సీఏఏ అమలును వ్యతిరేకిస్తూ పిటిషన్లు .. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు..

Advertisement

ఆ సమయంలోనూ భారత్ పై డ్రాగన్ విమర్శలు చేసింది. ఆ భూభాగం తమదేనని వాదించింది. భారత్ చర్యలు సరిహద్దు వివాదాన్ని మరింత సంక్లిష్టంగా మార్చేస్తాయని విమర్శలు చేసింది. ఆ సమయంలోనూ భారత్ గట్టిగా సమాధానం చెప్పింది.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×