E-Paper
Advertisement

India- China: అరుణాచరల్ ప్రదేశ్ పై చైనా మొండి వాదన.. భారత్‌ కౌంటర్‌..

India- China: అరుణాచరల్ ప్రదేశ్ పై చైనా మొండి వాదన..  భారత్‌ కౌంటర్‌..
India- China
India- China

India- China: అరుణాచల్ ప్రదేశ్ పై చైనా కుట్రలు ఆగడంలేదు. దక్షిణ టిబెట్.. జాంగ్నాన్  తమదేనని మొండి వాదన చేస్తోంది. ఆ భూభాగం తమ దేనని ఆ దేశ రక్షణశాఖ అధికార ప్రతినిధి సీనియర్ ఝాంగ్ షియాంగాంగ్ అన్నారు. చైనా వాదనకు భారత్ ధీటుగా బదులిచ్చింది. అరుణాచల్ భారత్ లో అంతర్భాగమని తేల్చిచెప్పింది. ఆధారాలు లేకుండా మాట్లాడితే.. వాస్తవాలు మారవని చైనాకు బదులిచ్చింది.

జాంగ్నాన్ ప్రాంతంపై చైనా రక్షణశాఖ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. మళ్లీ మళ్లీ చైనా నిరాధార వాదనలు చేస్తోందని మండిపడింది. జాంగ్నాన్ ప్రాంతంలో భారత్ లోనిదేనని స్పష్టం చేసింది. అక్కడ భారత్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్తి చేసిన విషయాన్ని ప్రస్తావించింది. ఈ అభివృద్ధి పనుల వల్ల జాంగ్నాన్ ప్రాంత ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయని భారత్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ ప్రకటించారు.

భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో సేలా సొరంగ మార్గాన్ని ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభోత్సవం చేశారు. అక్కడికి సైనిక బలగాలు, ఆయుధాలను తీసుకెళ్లేందుకు ఈ మార్గం ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో చైనా మొండి వాదనలు మొదలుపెట్టింది.

Also Read :  సీఏఏ అమలును వ్యతిరేకిస్తూ పిటిషన్లు .. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు..

ఆ సమయంలోనూ భారత్ పై డ్రాగన్ విమర్శలు చేసింది. ఆ భూభాగం తమదేనని వాదించింది. భారత్ చర్యలు సరిహద్దు వివాదాన్ని మరింత సంక్లిష్టంగా మార్చేస్తాయని విమర్శలు చేసింది. ఆ సమయంలోనూ భారత్ గట్టిగా సమాధానం చెప్పింది.

Tags

Related News

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

Big Stories

×