E-Paper
Advertisement

Supreme Court : సీఏఏ అమలును వ్యతిరేకిస్తూ పిటిషన్లు .. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు..

Supreme Court : సీఏఏ అమలును వ్యతిరేకిస్తూ పిటిషన్లు .. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు..
Advertisement
Citizenship Amendment Act
Citizenship Amendment Act

Citizenship Amendment Act: కేంద్ర ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం .. సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. సీఏఏ అమలుపై స్టే విధించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

ఈ చట్టంతో ఏ వ్యక్తి పౌరసత్వం తొలగించమని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనల తర్వాత  జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం  కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. 3 వారాల్లోపు సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది.

Advertisement

2019లో సీఏఏ పార్లమెంట్ ఆమోదం పొందింది. ఆ తర్వాత అనేక మంది పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించారు. సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఆ సమయంలోనూ కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. అయితే అప్పటికి నిబంధనలు నోటిపై చేయలేదని కేంద్రం న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చింది. చట్టం అమల్లోకి రాలేదని నాడు సుప్రీంకి తెలిపింది. తాజాగా సీఏఏ నిబంధనలు-2024 నోటీ చేసింది. దీంతో సీఏఏ అమల్లోకి వచ్చింది.

Also Read: రిట్ పిటిషన్ ను వెనక్కి తీసుకున్న ఎమ్మెల్సీ కవిత

Advertisement

సీఏఏను సవాల్ చేస్తూ ఇప్పటికే 200 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఈ చట్టం అమలుపై స్టే విధించాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు మాత్రమే ఇచ్చింది. చట్టం అమలుపై స్టే విధించలేదు. తుదిపరి విచారణ ఏప్రిల్ 9కు వాయిదా పడింది. సీఏఏపై సుప్రీంకోర్టు స్టే విధించకపోవడంతో ఈ చట్టం అమలు కొనసాగుతుంది.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×