E-Paper
Advertisement

Supreme Court : సీఏఏ అమలును వ్యతిరేకిస్తూ పిటిషన్లు .. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు..

Supreme Court : సీఏఏ అమలును వ్యతిరేకిస్తూ పిటిషన్లు .. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు..
Citizenship Amendment Act
Citizenship Amendment Act

Citizenship Amendment Act: కేంద్ర ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం .. సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. సీఏఏ అమలుపై స్టే విధించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

ఈ చట్టంతో ఏ వ్యక్తి పౌరసత్వం తొలగించమని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనల తర్వాత  జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం  కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. 3 వారాల్లోపు సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది.

2019లో సీఏఏ పార్లమెంట్ ఆమోదం పొందింది. ఆ తర్వాత అనేక మంది పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించారు. సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఆ సమయంలోనూ కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. అయితే అప్పటికి నిబంధనలు నోటిపై చేయలేదని కేంద్రం న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చింది. చట్టం అమల్లోకి రాలేదని నాడు సుప్రీంకి తెలిపింది. తాజాగా సీఏఏ నిబంధనలు-2024 నోటీ చేసింది. దీంతో సీఏఏ అమల్లోకి వచ్చింది.

Also Read: రిట్ పిటిషన్ ను వెనక్కి తీసుకున్న ఎమ్మెల్సీ కవిత

సీఏఏను సవాల్ చేస్తూ ఇప్పటికే 200 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఈ చట్టం అమలుపై స్టే విధించాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు మాత్రమే ఇచ్చింది. చట్టం అమలుపై స్టే విధించలేదు. తుదిపరి విచారణ ఏప్రిల్ 9కు వాయిదా పడింది. సీఏఏపై సుప్రీంకోర్టు స్టే విధించకపోవడంతో ఈ చట్టం అమలు కొనసాగుతుంది.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×