BigTV English
Advertisement

Indian Navy is Stronger: ఇకపై నిఘా మరింత పటిష్ఠం.. భారత నేవీలోకి అధునాతన విమానాలు..

Indian Navy is Stronger: ఇకపై నిఘా మరింత పటిష్ఠం.. భారత నేవీలోకి అధునాతన విమానాలు..

Steps taken to strengthen Indian Navy: హిందూ మహాసముద్రంలో నిఘా వ్యవస్థను భారత్ మరింత పటిష్ఠం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఎయిర్‌బస్‌ ఎస్‌ఈ నుంచి డజన్‌కి పైగా నిఘా విమానాలను భారత్ త్వరలో కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది.


దేశ రక్షణ కోసం భారత్ అంతర్జాతీయ సంస్థల నుంచి ఆయుధాలు, యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంటుంది. హిందూ మహాసముద్రంలో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ప్రాంతంలో తన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు డజన్ల కొద్దీ నిఘా విమానాలను కొనుగోలు చేయనున్నట్లు రక్షణశాఖ మంత్రిరాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో అక్విజిషన్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.

విమానయాన దిగ్గజ సంస్థ ఎయిర్‌బస్‌ ఎస్‌ఈ నుంచి భారత్ డజన్‌కి పైగా నిఘా విమానాలను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం సంస్థతో రూ.2,900 కోట్ల ఒప్పందాలను కుదుర్చుకుంది. మధ్యస్థ-శ్రేణి, బహుళ మిషన్‌ సముద్ర నిఘా విమానం భారత్‌ సముద్ర ప్రాంతంలోని దేశ నావికాదళం, కోస్ట్‌ గార్డ్‌ నిఘా సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని రక్షణ మంత్రత్వ శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది.


Read More: ఇస్రో శాస్ర్తవేత్తలకు అభినందనలు తెలిపిన కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌

ఈ నిఘా విమానాల్లో తొమ్మిది భారత నౌకాదళానికి, ఆరు కోస్ట్‌ గార్డ్‌కు వెళ్లనున్నాయి. వీటిని వీలైనంత త్వరగా మోహరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నాలుగు సీ-295 విమానాలను ఎయిర్‌బస్‌ తయారుచేస్తుండగా.. మిగిలినవి భారత్‌లో తయారు కానున్నాయి. అరేబియా మహాసముద్రంలో డజన్ల కొద్దీ యుద్ధ నౌకలు, మానవరహిత వైమానిక వెహికిల్స్‌ను మోహరించింది. తాజాగా నిఘా విమానాలతో హిందూ మహాసముద్రంలోనూ సామర్థ్యాన్ని మరింత బలపరుచుకోనుంది.

Related News

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Big Stories

×