Railwayline: బ్రిటీషర్లు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాక రైల్వేలైన్లన్నీ భారత్ ఆధీనంలోకి వచ్చాయి. కానీ ఒక్క లైన్ మాత్రం ఇంకా బ్రిటీషర్ల ఆధీనంలోనే ఉంది. ఇప్పటికీ ఆ లైన్లో రైళ్లను నడిపింనందుకుగానూ ఇండియన్ రైల్వే బ్రిటిషర్లకు అద్దె చెల్లిస్తోంది.
అదే మహారాష్ట్రలోని యావత్మాల్-ముర్తిజాపుర్ మధ్యగల రైల్వే లైన్. 1952లో రైల్వేల జాతీయీకరణ సమయంలో ఆధికారులు ఈ లైనును మర్చిపోయారు. దీంతో ఆ లైన్ ఇప్పటికీ బ్రిటీషర్ల ఆధీనంలోనే ఉంది. అందుకే ప్రతిఏటా ఇండియన్ రైల్వేస్ బ్రిటీషర్లకు రూ. కోటి అద్దె కడుతోంది.
యావత్మాల్ స్టేషన్ నుంచి ముర్తిజాపుర్ స్టేషన్కు ప్రయాణించేందుకు 20 గంటల సమయం పడుతుంది. టికెట్ ధర రూ. 150. ముఖ్యంగా ఆ ప్రాంతంలోని పేదలకు ఈ లైన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఈ లైన్ను బ్రాడ్ గేజ్గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.