E-Paper
Advertisement

India-US: యూఎస్ మానవ హక్కుల నివేదిక.. భారత్ తీవ్ర అభ్యంతరం

India-US: యూఎస్ మానవ హక్కుల నివేదిక.. భారత్ తీవ్ర అభ్యంతరం

India-US: భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అమెరికా ఇచ్చిన నివేదికపై భారత విదేశాంగ శాఖ అభ్యంతరం తెలిపింది. మణిపూర్‌ అల్లర్ల తర్వాత దేశంలో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని అమెరికా ఓ నివేదిక విడుదల చేసింది. దీనిపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

అమెరికా పూర్తిగా పక్షపాత వైఖరితో నివేదిక ఇచ్చిందని భారత్ దుయ్యబట్టింది. అమెరికా ఇచ్చిన నివేదికకు ఎలాంటి విలువ లేదని తెలిపింది. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ ఈ అంశం గురించి ప్రస్తావించారు. భారత్‌ ను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నారో ఈ నివేదిక ద్వారా అర్థమవుతోందని తెలిపారు.

అందుకే అమెరికా నివేదికకు తాము ఎలాంటి విలువ ఇవ్వడం లేదని తెలిపారు. మానవ హక్కుల విధానాలపై అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా వార్షిక నివేదికను విడుదల చేసింది. ఇందులో మణిపుర్‌ అల్లర్లను ప్రస్తావించింది. అయితే ఈ సమయంలోనే భారత్ లో తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని పేర్కొంది.

Also Read:రేపే రెండో దశ ఎన్నికల పోలింగ్‌.. ఓటర్లకు ఐఎండీ కీలక హెచ్చరికలు..!

మణిపూర్  ఘటనలను ప్రధాని మోదీ సిగ్గుచేటని అభివర్ణించడంతో పాటు..వారిపై చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు వెల్లడించింది. భావ ప్రకటనా స్వేచ్ఛ, మానవ హక్కులకు సంబంధించిన అంశాలను సైతం ఇందులో పేర్కొన్నారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×