E-Paper
Advertisement

Jagdeep dhankhar: ‘వాళ్లు హద్దులు దాటారు’.. ఉపరాష్ట్రపతికి ఎన్డీయే ఎంపీలు నిల్చొని సంఘీభావం ..

Jagdeep dhankhar: ‘వాళ్లు హద్దులు దాటారు’.. ఉపరాష్ట్రపతికి ఎన్డీయే ఎంపీలు నిల్చొని సంఘీభావం ..

Jagdeep dhankhar: రాజ్యసభలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ లో వివక్షాల ప్రదర్శనపై రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ కు మద్దతుగా ఎన్డీయే ఎంపీలు కొద్ది సేపు నిలబడి సంఘీభావం తెలియజేశారు. ధన్‌ఖడ్‌ను హేళన చేస్తూ తృణముల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాన్ బెనర్జీ చేసిన చేష్టలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ ఘటనను ఎన్డీయే ఎంపీలు తీవ్రంగా ఖండించారు. ఛైర్మన్‌ ధన్‌ఖడ్‌ సైతం ఈ చర్యను ఖండించారు. ప్రధాని మోదీ సైతం ఉదయం ఉపరాష్ట్రపతికి ఫోన్‌ చేసి సంఘీభావం తెలిపారు.

అయితే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి రాజ్యసభలో మాట్లాడుతూ ‘‘ఈ చర్యను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్లు రాజ్యాంగ బద్ధమైన స్థానాల్లో ఉన్నవాళ్లను పదే పదే అవమానిస్తున్నారు. అన్నివిధాలుగా పరిధి దాటి ప్రవర్తించారన్నారు. ఓబీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఓ ప్రధానిని సైతం అవమానిస్తూ వస్తున్నారు. గిరిజన మహిళ అయినటువంటి రాష్ట్రపతిని సైతం అవమానించారు. జాట్‌ కమ్యూనిటీ నుంచి ఉపరాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి ధన్ ఖడ్. ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. అలాంటి వ్యక్తిని అవమానించడం సిగ్గుచేటన్నారు” ప్రహ్లాద్ జోషి.

ఉపరాష్ట్రపతి ఉన్నతస్థానం పట్ల విపక్షాలకు గౌరవం లేదని ప్రహ్లాద్ జోషి అన్నారు . రాజ్యాంగాన్ని, ఉపరాష్ట్రపతిని అవమానించడం తాము సహించలేక లేకపోతున్నామని విపక్షాలపై మండిపడ్డారు. విపక్షాలు అన్ని రకాలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారన్నారు. ఉపరాష్ట్రపతిని హేళన ఘటనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. గౌరవసూచికంగా ప్రశ్నోత్తరాల సమయం మొత్తం మేం నిలబడాలని నిర్ణయించుకున్నామన్నారు. గంట సేపు నిల్చొని సభా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Tags

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×