E-Paper
Advertisement

Jagdeep dhankhar: ‘వాళ్లు హద్దులు దాటారు’.. ఉపరాష్ట్రపతికి ఎన్డీయే ఎంపీలు నిల్చొని సంఘీభావం ..

Jagdeep dhankhar: ‘వాళ్లు హద్దులు దాటారు’.. ఉపరాష్ట్రపతికి ఎన్డీయే ఎంపీలు నిల్చొని సంఘీభావం ..
Advertisement

Jagdeep dhankhar: రాజ్యసభలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ లో వివక్షాల ప్రదర్శనపై రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ కు మద్దతుగా ఎన్డీయే ఎంపీలు కొద్ది సేపు నిలబడి సంఘీభావం తెలియజేశారు. ధన్‌ఖడ్‌ను హేళన చేస్తూ తృణముల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాన్ బెనర్జీ చేసిన చేష్టలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ ఘటనను ఎన్డీయే ఎంపీలు తీవ్రంగా ఖండించారు. ఛైర్మన్‌ ధన్‌ఖడ్‌ సైతం ఈ చర్యను ఖండించారు. ప్రధాని మోదీ సైతం ఉదయం ఉపరాష్ట్రపతికి ఫోన్‌ చేసి సంఘీభావం తెలిపారు.

అయితే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి రాజ్యసభలో మాట్లాడుతూ ‘‘ఈ చర్యను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్లు రాజ్యాంగ బద్ధమైన స్థానాల్లో ఉన్నవాళ్లను పదే పదే అవమానిస్తున్నారు. అన్నివిధాలుగా పరిధి దాటి ప్రవర్తించారన్నారు. ఓబీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఓ ప్రధానిని సైతం అవమానిస్తూ వస్తున్నారు. గిరిజన మహిళ అయినటువంటి రాష్ట్రపతిని సైతం అవమానించారు. జాట్‌ కమ్యూనిటీ నుంచి ఉపరాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి ధన్ ఖడ్. ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. అలాంటి వ్యక్తిని అవమానించడం సిగ్గుచేటన్నారు” ప్రహ్లాద్ జోషి.

Advertisement

ఉపరాష్ట్రపతి ఉన్నతస్థానం పట్ల విపక్షాలకు గౌరవం లేదని ప్రహ్లాద్ జోషి అన్నారు . రాజ్యాంగాన్ని, ఉపరాష్ట్రపతిని అవమానించడం తాము సహించలేక లేకపోతున్నామని విపక్షాలపై మండిపడ్డారు. విపక్షాలు అన్ని రకాలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారన్నారు. ఉపరాష్ట్రపతిని హేళన ఘటనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. గౌరవసూచికంగా ప్రశ్నోత్తరాల సమయం మొత్తం మేం నిలబడాలని నిర్ణయించుకున్నామన్నారు. గంట సేపు నిల్చొని సభా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Tags

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×