E-Paper
Advertisement

‘Jai Shri Ram’ In Mosque: మసీదులో ‘జై శ్రీ రామ్’ జపించడం నేరం కాదు.. హై కోర్టు కీలక వ్యాఖ్యలు

‘Jai Shri Ram’ In Mosque: మసీదులో ‘జై శ్రీ రామ్’ జపించడం నేరం కాదు.. హై కోర్టు కీలక వ్యాఖ్యలు
Advertisement

‘Jai Shri Ram’ In Mosque| మసీదు లోపల జై శ్రీ రామ్ అంటూ జపించడం, అరవడం నేరం కాదని కర్ణాటక హై కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు వ్యక్తులు మసీదులోపలికి వచ్చి జై శ్రీ రామ్ అంటూ గట్టిగా అరుపులు, కేకలు వేశారని.. దీని వల్ల తమ మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయని వారిపై క్రిమనిల్ కేసులో నమోదు అయింది.

ఇద్దరు నిందితులపై ఐపిసి సెక్షన్ 295A(మతాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించడం), ఐపిసి సెక్షన్ 447 (నిషేధిక ప్రాంతంలో ప్రవేశించడం), ఐపిసి సెక్షన్ 505 (బహిరంగ ప్రదేశంలో అల్లర్లు చేయడం), సెక్షన్ 506 (రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం) ప్రకారం కేసు నమోదైంది.

Advertisement

Also Read: 7 ఏళ్ల బాలుడు కిడ్నాప్.. కిడ్నాపర్లపై పగతో ఆ పిల్లాడు ఎంత పనిచేశాడంటే..

ఈ కేసుకి వ్యతిరేకంగా ఇద్దరు నిందితులు హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ విచారణ చేపట్టిన కర్ణాటక హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ యం. నాగప్రసన్న ఈ కేసుని కొట్టివేశారు. విచారణ సమయంలో న్యాయమూర్తి మాట్లాడుతూ ..” జై శ్రీ రామ్ అని నినాదాలు చేస్తే.. ఇతం మతం లేదా మరో వర్గం మనోభావాలు ఎలా దెబ్బతింటాయో తనకు అర్థం కావడం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తులే ఆ ప్రాంతంలో హిందూ ముస్లింలు ఐక్యమత్యంగా నివసిస్తున్నారని పేర్కొన్నారు. మరి అలాంటి సందర్భంలో పిటీషనర్లకు (నిందితులు) వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. సుప్రీం కోర్ట ఆదేశాల ప్రకారం.. ఐపిసి సెక్షన్ 295Aని చిన్న చిన్న ఆరోపణల్లో ఉపయోగించకూడదు. కేవలం నినాదాలు చేసినంత మాత్రాన మతపరమైన అల్లర్లు జరుగుతాయని ఊహించకోవడం సరికాదు. నిందితుల చర్యలతో శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని పేర్కొనడం సమంజసం కాదు. ” అని వ్యాఖ్యానించారు.

Advertisement

సెప్టెంబర్ 24, 2023 రాత్రి 10.50 గంటలకు మసీదులో ఇద్దరు నిందితులు బలపూర్వకంగా ప్రవేశించి జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేశారని, మసీదు పరిసరాల్లో బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసే సమయంలో నిందితులను గుర్తు తెలియని వ్యక్తులుగా పేర్కొన్నారు. ఆ తరువాత నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే తమను పోలీసులు చట్ట వ్యతిరేకంగా అరెస్ట చేశారని.. నిందితులిద్దరూ కర్ణాటక హైకోర్టులో పిటీషన్ వేశారు. అయితే ప్రభుత్వం తరపున న్యాయవాది ఈ పిటీషన్ ని కొట్టివేయాలని.. ఇద్దరు నిందితుల పోలీస్ కస్టడీ పొడిగించాలని.. కేసులో మరింత విచారణ చేయాల్సిన అవసరముందని కోర్టుని కోరారు.

Also Read: ఫారిన్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..

కానీ పిటీషన్ విచారణ చేసిన కోర్టు కేసు కొట్టివేసింది. కానీ హిందూ ముస్లింలు ఐక్యమత్యంగా ఉన్న ప్రాంతాల్లో మతపరమైన అల్లర్లు రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేయడం సరికాదని కూడా వ్యాఖ్యానించింది.

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×