BigTV English
Advertisement

Maldives Row : ‘నేను ఆ హామీ ఇవ్వలేను’.. మాల్దీవుల వివాదంపై జైశంకర్ వ్యాఖ్యలు..

Maldives Row : భారత్‌-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం నడుస్తున్న వేళ.. విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందించారు. భారత దేశానికి ప్రతిసారి అన్ని దేశాల మద్దతు ఉంటుందని హామీ ఇవ్వలేమని ఆయన వ్యాఖ్యానించారు.

Maldives Row : ‘నేను ఆ హామీ ఇవ్వలేను’.. మాల్దీవుల వివాదంపై జైశంకర్ వ్యాఖ్యలు..

Maldives Row : భారత్‌-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం నడుస్తున్న వేళ.. విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందించారు. భారత దేశానికి ప్రతిసారి అన్ని దేశాల మద్దతు ఉంటుందని హామీ ఇవ్వలేమని ఆయన వ్యాఖ్యానించారు.


భారత ప్రధాని నరేంద్ర మోదీ, లక్షద్వీప్‌పై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలతో మనదేశం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇది కాస్తా రెండు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలకు దారితీసింది. దీనిపై జైశంకర్‌ను ప్రశ్నించగా..రాజకీయాలను రాజకీయాల్లాగే చూడాలన్నారు. ప్రతి దేశమూ ప్రతిరోజూ మన అభిప్రాయాలతో ఏకీభవిస్తుందని నేను గ్యారంటీ ఇవ్వలేనని ఆయన స్పష్టం చేశారు. గత పది సంవత్సరాలుగా ఈ ప్రపంచంతో భారత్‌ను అనుసంధానించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఎన్నో విజయాలు సాధించామని జైశంకర్ తెలిపారు.

ఇతర దేశాలతో స్నేహ పూర్వక సంబంధాల కోసం భారత్‌ చేస్తోన్న ప్రయత్నాల గురించి జై శంకర్ మాట్లాడారు. రాజకీయ సంబంధాల్లో హెచ్చుతగ్గులు ఉండడం సహజమన్నారు. సాధారణంగా ఆయా దేశ ప్రజలు భారత్‌పట్ల సానుకూల భావాలనే కలిగి ఉంటారన్నారు. భారత్‌తో సత్సంబంధాల ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారని జై శంకర్ చెప్పారు.


ఇదిలా ఉండగా.. భారత్ మాల్దీవుల మద్య ఈ విభేదాలు నడుస్తోన్న తరుణంలోనే మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు చైనాలో పర్యటించారు. స్వదేశానికి వచ్చిన తర్వాత తమది భౌగోళికంగా చిన్నదేశమే.. కానీ బెదిరించడం తగదని కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు చైనా మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం జోక్యం చేసుకున్నా గట్టిగా వ్యతిరేకిస్తామని ప్రకటించింది.

ఈ పరిణామాల మధ్యే తమ దేశంలో ఉన్న సైనిక దళాలను మార్చి 15లోగా ఉపసంహరించుకోవాలని మన దేశాన్ని ముయిజ్జు కోరిన సంగతి తెలిసిందే. మాల్దీవుల్లో 88 మంది భారత్‌ సైనికులు విధులు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం.

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×