E-Paper
Advertisement

Kapil Sibal: కేజ్రీవాల్, సిసోడియా, కవిత జైలు జీవితానికి జవాబుదారీ ఎవరు?.. కేంద్ర ప్రభుత్వంపై కపిల్ సిబల్ ఫైర్

Kapil Sibal: కేజ్రీవాల్, సిసోడియా, కవిత జైలు జీవితానికి జవాబుదారీ ఎవరు?.. కేంద్ర ప్రభుత్వంపై కపిల్ సిబల్ ఫైర్
Advertisement

Kapil Sibal: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో న్యాయస్థానం వెలువరించిన తీర్పుపై రాజ్యసభ ఎంపీ, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫిబ్రవరి 27న ప్రత్యేక కోర్టు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కె. కవిత సహా ఇతర నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పు నేపథ్యంలో కపిల్ సిబల్ స్పందిస్తూ రాజకీయ ప్రతీకారంతోనే ఈ తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా విపక్ష నేతలను ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా దర్యాప్తు సంస్థలను వాడుకున్నారని విమర్శించారు.

ఈ సందర్భంగా కపిల్ సిబల్ కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రశ్నలు సంధించారు. కేజ్రీవాల్ సుమారు 126 రోజులు.. మనీష్ సిసోడియా ఏకంగా 503 రోజుల పాటు జైలులో గడిపారని ఆయన గుర్తు చేశారు. ఏ తప్పూ చేయని ఈ నాయకులు జైలులో గడిపిన సుదీర్ఘ కాలానికి ఎవరు పరిహారం చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. వారి వ్యక్తిగత జీవితాలకు.. రాజకీయ ప్రతిష్టకు జరిగిన నష్టానికి ఎవరిని జవాబుదారీగా ఉంచాలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమాయకులను ఇన్ని రోజులు కటకటాల వెనుక ఉంచడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆయన అభివర్ణించారు.

Advertisement

ఈ కేసులో ఆర్థిక లావాదేవీలపై వస్తున్న ఆరోపణలను కపిల్ సిబల్ పూర్తిగా కొట్టిపారేశారు. ఇది రూ. 100 కోట్ల కుంభకోణం అని దర్యాప్తు సంస్థలు గొప్పగా పేర్కొన్నాయని.. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేకపోయాయని ఎద్దేవా చేశారు. ఈ కేసులో ఎటువంటి అక్రమ ఆర్థిక లావాదేవీలు జరగలేదని కోర్టు తీర్పుతో స్పష్టమైందని పేర్కొన్నారు. సాక్ష్యాలు లేని కేసును ఇన్నేళ్లపాటు సాగదీయడం వెనుక ఉన్న రాజకీయ కుట్రను ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.

కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరుపై కూడా సిబల్ అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు లోబడి పనిచేయడం వల్ల అమాయకులు బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఆరోపణలతోనే నెలల తరబడి జైలులో ఉంచడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని స్పష్టం చేశారు. ఇప్పుడైనా ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని.. తప్పుడు కేసులతో ప్రతిపక్షాలను అణచివేయాలని చూడటం మానుకోవాలని హితవు పలికారు. న్యాయస్థానం తీర్పుతోనైనా నిజాన్ని అంగీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Read Also: MP Arvind: కవిత పై ఎంపీ అరవింద్ సెటైర్లు.. కవిత లోపలున్నా బయటున్నా ఒరిగేదేం లేదంటూ..?

Related News

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

Big Stories

Advertisement
×