Tanvir Ahmed: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament ) భాగంగా ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక ( Pakistan vs Sri Lanka) మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిస్తేనే పాకిస్తాన్ కు సెమీ ఫైనల్ అవకాశాలు ఉంటాయి. అది కూడా భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక క్రికెట్ బోర్డుతో మ్యాచ్ ఫిక్సింగ్ ( Match Fixing) చేసుకొని ఎలాగైనా పాకిస్తాన్ గెలవాలని వెల్లడించారు తన్వీర్ అహ్మద్ ( Tanvir Ahmed). అలా గెలిస్తేనే సెమీ ఫైనల్ కు వెళ్తామని సూచనలు చేశారు. ఈ దిశగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board) ముందుకు వెళ్లాలని సూచనలు చేశారు. పచ్చిగా శ్రీలంక క్రికెట్ బోర్డును కొనేయాలని వెల్లడించారు.
Also Read: Abhishek Sharma-Yuvraj Singh: అభిషేక్ శర్మకు ఘోర అవమానం…చెప్పులు చూపించిన యువరాజు
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament ) సెమీ ఫైనల్ కు వెళ్లాలంటే పాకిస్తాన్ కు ఒకే ఒక్క దారి ఉంది. ఇవాళ జరిగే శ్రీలంక ( Srilanka) మ్యాచ్ లో అఖండ విజయం నమోదు చేయాలి. భారీ విజయాన్ని నమోదు చేస్తే కచ్చితంగా సెమీ ఫైనల్ లో అడుగుపెడుతుంది పాకిస్తాన్. అయితే ఇప్పటికే ఈ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిన శ్రీలంక మాత్రం, ఈ ఒక్క మ్యాచ్ లో అయినా గెలిసి పరువు నిలబెట్టుకోవాలని ఆలోచన చేస్తోంది. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక పైన భారీ విజయాన్ని నమోదు చేయడం చాలా కష్టమని పేర్కొన్నారు. ఇలాంటి నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డును ( Sri Lanka Cricket Board ) కొనేయండి… వాళ్లతో ఫిక్సింగ్ ( Match Fixing) చేయండి అంటూ సూచనలు చేశారు. దీంతో శ్రీలంకపై అలవోకగా పాకిస్తాన్ విజయం సాధించి సెమీ ఫైనల్ కు వెళుతుందని కన్నింగ్ ఆలోచనలు ఇచ్చారు మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanvir Ahmed). దీంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మ్యాచ్ గెలిచేందుకు పాకిస్తాన్ వెధవలు ఎంతకైనా తెగిస్తారని ఇండియన్ ఫాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.
ఇవాళ శ్రీలంకతో పాకిస్తాన్ మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో పాకిస్తాన్ భారీ పరుగుల తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. శ్రీలంక పైన 70 పరుగుల తేడాతో విజయం సాధిస్తేనే సెమీ ఫైనల్ లోకి పాకిస్తాన్ ఎంట్రీ ఇస్తుంది. లేదా ఛేజింగ్ సమయంలో 10.5 ఓవర్లలోనే శ్రీలంకను ఓడించాలి. అప్పుడు న్యూజిలాండ్ ఇంటికి వెళ్లడం, పాకిస్తాన్ సెమీ ఫైనల్ కు వెళ్లడం జరుగుతుంది.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==