E-Paper
Advertisement

Kargil Vijay Diwas 2024: కార్గిల్ విజయ్ దివస్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ.. లదాఖ్‌లో షింకున్ లా ప్రాజెక్టు పనులు ప్రారంభం

Kargil Vijay Diwas 2024: కార్గిల్ విజయ్ దివస్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ.. లదాఖ్‌లో షింకున్ లా ప్రాజెక్టు పనులు ప్రారంభం
Advertisement

Kargil Vijay Diwas 2024: లదాఖ్ లో శుక్రవారం జరుగనున్న కార్గిల్ విజయ్ దివస్‌ 25వ వార్షిక వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇతర మంత్రులు పాల్గొన్నారు. 1999 పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో భారత దేశం విజయం సాధించిన సందర్భగా ఈ వేడుకలు జరుపుకుంటారు. వేడుకల్లో భాగంగా యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన సైకికులను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం తరువాత ప్రధాని మోదీ.. లదాఖ్ లోని లేహ్ ప్రాంతంలో షింకున్ లా ట్విన్ టన్నెల్ పనులను వర్చువల్‌గా ప్రారంభిస్తారు.

4.1 కిలోమీటర్ల పొడవున్న ఉన్న ఈ టన్నెల్ ట్విన్ ట్యూబ్ ఆకారంలో ఉంటుంది. 15,800 అడుగుల ఎత్తులో నిము-పడుమ్-దర్చా రోడ్డుపై నిర్మిస్తున్నారు. చలికాలంలో మంచు తీవ్రంగా కురవడంతో నాలుగు నెలలపాటు లేహ్ నగరానికి వెళ్లేందుకు దారి మూసుకుపోతుంది. ఆ సమయంలో అంతా కొండప్రాంతం చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ఆ దారితలో కొండచరియులు, భారీ మంచు శకలాలు విరిగి పడుతుంటాయి.. ఈ ఘటనల్లో ప్రతీ సంవత్సరం పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. ఇప్పుడు ఈ టన్నెల్ నిర్మాణంతో ఆ సమస్య తీరిపోతుందని.. లేహ్ నగరానికి సంవత్సరమంతా దారి తెరిచే విధంగా టన్నెల్ నిర్మాణం జరుగుతుందని అధికారులు తెలిపారు.

Advertisement

జూలై 26న ప్రతి భారత పౌరుడికి చాలా ముఖ్యమైన రోజు అని ప్రధాని మోదీ ట్విట్టర్ ఎక్స్ లో తెలుపుతూ ఓ పోస్ట్ చేశారు. ”25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా.. దేశ భద్రత కోసం పనిచేసే వారికి ఈ రోజు అంకితం. నేను కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులు అర్పించేందుకు కార్గిల్ విచ్చేస్తాను. షింకున్ లా టన్నెల్ ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభమవుతాయి. లేహ్ నగరానికి మంచు వాతావరణంలో కూడా రోడ్డు మార్గం కల్పించేందుకు ఈ ప్రాజెక్టు చాలా అవసరం.” అని ట్వీట్ చేశారు.

Advertisement

కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులు అర్పించిన ప్రజలు
లదాఖ్ లోని ద్రాస్ ప్రాంతంలో ఉన్న కార్గిల్ యుద్ద వీరుల స్తూపం వద్ద శుక్రవారం ఉదయం నుంచే ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. ఈ స్తూపం యుద్ధ వీరుల ధైర్య, సాహసాలకు ప్రతీకం. కార్గిల్ యుద్ధం 25వ వార్షికత్సవం సందర్భంగా యుద్ధంలో దేశ సరిహద్దులు కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన వీర సైనికులకు దేశ పౌరులంతా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.

 

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×