BigTV English
Advertisement

PM Modi on Bangalore Water Crisis: బెంగళూరులో నీటి సమస్య.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య చెలరేగిన ‘ఖాళీ చెంబు’ రాజకీయం!

PM Modi on Bangalore Water Crisis: బెంగళూరులో నీటి సమస్య.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య చెలరేగిన ‘ఖాళీ చెంబు’ రాజకీయం!

PM Modi Vs Karnataka CM Siddaramaiah: కర్ణాటకలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ‘నీటి రాజకీయం’ చెలరేగింది. కేంద్ర అధికార పార్టీ, రాష్ట్ర అధికార పార్టీ మధ్య ‘ఖాళీ చెంబు’ రాజకీయం ఊపందుకుంది. దీంతో ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ టెక్ సిటీని ట్యాంకర్ సిటీగా మార్చారంటూ కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తిప్పికొట్టారు.


పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరులో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. టెక్ సిటీని ట్యాంకర్ సిటీగా మార్చే ఘనత కాంగ్రెస్ సర్కార్ కే దక్కు తుందని మోదీ ఎద్దేవా చేశారు. మోదీ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.. వరదలు, కరువుతో కర్ణాటక ఇబ్బంది పడుతుంటే అప్పుడు మోదీ ఎక్కడున్నారని ప్రశ్నించారు.

బీజేపీ దేశాన్ని ప్రగతి పథంలో తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు చేస్తుంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం మోదీని గద్దె దించడానికి ప్రయత్నాలు చేస్తోందన్నారు. కర్ణాటకను కాంగ్రెస్ ప్రభుత్వం యాంటీ ఇన్వెస్టిమెంట్, యాంటీ ఎంట్రప్రెన్యూర్ షిప్, యాంటీ ప్రైవేట్ సెక్టార్, యాంటీ టాక్స్ పేయర్ గా మార్చిందని మోదీ ఆరోపణలు చేశారు.


Also Read: ఆ పార్టీ అంతా మోదీని పూజించే వారే: చిదంబరం

కాగా, ఇటీవలే కార్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్రం ఏం ఇవ్వలేదని చూపుతూ.. కేవలం ఖాళీ చెంబును చూపిస్తూ ఓ యాడ్ చేసింది. ఈ తర్వాత ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జేడీఎస్ చీఫ్ దేవెగౌడ్ ఓ సభలో కూర్చుని ఖాళీ చెంబు యాడ్ ను న్యూస్ పేపర్ లో చూపిస్తున్నట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. దేవెగౌడ చూపిస్తున్న ఆర్ట్ కు ప్రధాని మోదీ ఆర్టిస్ట్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

దీనిపై బీజేపీ స్పందిస్తూ.. కాంగ్రెస్ కు కౌంటర్ ట్వీట్ చేసింది. 2013లో సిద్ధరామయ్య చేతిలో చెంబు పట్టుకున్నట్లు.. 2023లో ఆయన చేతిలో చెంబు లేన్నట్లు ఉన్న ఫోటోను ట్వీట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ రెండు ఫోటోల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది అంటూ బీజేపీ క్యాప్షన్ ఇచ్చింది.

Also Read: Water Crisis: బెంగుళూరు తర్వాత కోల్‌కత్తా, నెక్ట్స్ హైదరాబాదేనా?

Related News

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Bihar Assembly Election 2025: బీహార్‌ తొలి విడత పోలింగ్‌.. 121 స్థానాలకు బరిలో 1,314 మంది

Big Stories

×