E-Paper
Advertisement

Karnataka Elections: అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కాంగ్రెస్.. కొడుకు స్థానం నుంచి సిద్ధరామయ్య పోటీ

Karnataka Elections: అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కాంగ్రెస్.. కొడుకు స్థానం నుంచి సిద్ధరామయ్య పోటీ

Karnataka Elections: కర్ణాటకలో ఎన్నికల హడావుడి అప్పుడే మొదలయింది. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. మే నెలతో ప్రస్తుతం శాసనసభ గడువు ముగియనుంది. ఈక్రమంలో రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాయి. తాజాగా అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 124 మంది అభ్యర్థులతో తొలి జాబితాను రిలీజ్ చేసింది.

ఊహించినట్లుగానే ఆపార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ఈసారి కోలార్ నుంచి కాకుండా తన కుమారుడు యతీంద్ర నియోజకవర్గం వరుణ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచన మేరకే ఈసారి వరుణ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. తన తండ్రి కోసం యతీంద్ర తన స్థానాన్ని త్యాగం చేశారు. అయితే తాజా జాబితాలో యతీంద్ర పేరు లేకపోవడం ఈ ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగకపోవచ్చని తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది.

ఇక ఆ పార్టీ అగ్రనేత డీకే శివకుమార్ కనకపురం నియోజకవర్గం నుంచి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే చీతాపూర్ నుంచి , జి.పరమేశ్వర కోరటగెరె స్థానం నుంచి పోటీకి దిగనున్నట్లు ఏఐసీసీ ప్రకటించింది.

Tags

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×