E-Paper
Advertisement

Karnataka: ఓటుకు ఆరు వేలిస్తా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

Karnataka: ఓటుకు ఆరు వేలిస్తా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

Karnataka: కర్ణాటకలో ఎన్నికల హడావుడి మొదలైంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో ఇప్పటి నుంచే పలు పార్టీల నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు హామీల మీద హామీలు కుమ్మరిస్తున్నారు. ఆఫర్లు ఇస్తూ తమ వలలో వేసుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రమేష్ జార్కి హోళి సంచలన వ్యాఖ్యలు చేశారు.

గత ఎన్నికల్లో సుళేబావి నియోజకవర్గం నుంచి రమేష్ పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మి హెబ్బాల్కర్పై చేతిలో ఓడిపోయారు. ఈక్రమంలో ఆమె గత ఎన్నికల్లో తాయిలాలు పంచిందంటూ ఆరోపిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘లక్ష్మి పోయిన ఎన్నికల్లో తాయిలాలు పంచింది. దాని విలువ మహా అయితే మూడు వేలు ఉంటుంది. నేను ఏకంగా ఆరు వేలు ఇస్తాను. మీ అందరూ నాకే ఓటు వేయాలి’’ అని అన్నాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

రమేష్ చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. ఒకవైపు ఉచితాలకు తాము వ్యతిరేకమని బీజేపీ చెబుతున్నా… ఆ పార్టీ నేతలు ఇటువంటి హామీలు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×