BigTV English

Karnataka: ఓటుకు ఆరు వేలిస్తా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

Karnataka: ఓటుకు ఆరు వేలిస్తా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు


Karnataka: కర్ణాటకలో ఎన్నికల హడావుడి మొదలైంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో ఇప్పటి నుంచే పలు పార్టీల నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు హామీల మీద హామీలు కుమ్మరిస్తున్నారు. ఆఫర్లు ఇస్తూ తమ వలలో వేసుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రమేష్ జార్కి హోళి సంచలన వ్యాఖ్యలు చేశారు.

గత ఎన్నికల్లో సుళేబావి నియోజకవర్గం నుంచి రమేష్ పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మి హెబ్బాల్కర్పై చేతిలో ఓడిపోయారు. ఈక్రమంలో ఆమె గత ఎన్నికల్లో తాయిలాలు పంచిందంటూ ఆరోపిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘లక్ష్మి పోయిన ఎన్నికల్లో తాయిలాలు పంచింది. దాని విలువ మహా అయితే మూడు వేలు ఉంటుంది. నేను ఏకంగా ఆరు వేలు ఇస్తాను. మీ అందరూ నాకే ఓటు వేయాలి’’ అని అన్నాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.


రమేష్ చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. ఒకవైపు ఉచితాలకు తాము వ్యతిరేకమని బీజేపీ చెబుతున్నా… ఆ పార్టీ నేతలు ఇటువంటి హామీలు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related News

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Big Stories

×