BigTV English

Karnataka: ఓటుకు ఆరు వేలిస్తా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

Karnataka: ఓటుకు ఆరు వేలిస్తా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు


Karnataka: కర్ణాటకలో ఎన్నికల హడావుడి మొదలైంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో ఇప్పటి నుంచే పలు పార్టీల నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు హామీల మీద హామీలు కుమ్మరిస్తున్నారు. ఆఫర్లు ఇస్తూ తమ వలలో వేసుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రమేష్ జార్కి హోళి సంచలన వ్యాఖ్యలు చేశారు.

గత ఎన్నికల్లో సుళేబావి నియోజకవర్గం నుంచి రమేష్ పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మి హెబ్బాల్కర్పై చేతిలో ఓడిపోయారు. ఈక్రమంలో ఆమె గత ఎన్నికల్లో తాయిలాలు పంచిందంటూ ఆరోపిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘లక్ష్మి పోయిన ఎన్నికల్లో తాయిలాలు పంచింది. దాని విలువ మహా అయితే మూడు వేలు ఉంటుంది. నేను ఏకంగా ఆరు వేలు ఇస్తాను. మీ అందరూ నాకే ఓటు వేయాలి’’ అని అన్నాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.


రమేష్ చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. ఒకవైపు ఉచితాలకు తాము వ్యతిరేకమని బీజేపీ చెబుతున్నా… ఆ పార్టీ నేతలు ఇటువంటి హామీలు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×