BigTV English
Advertisement

Karnataka Government on Kebabs: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. కబాబ్స్‌లో వాడే ఫుడ్ కలర్స్‌పై నిషేధం!

Karnataka Government on Kebabs: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. కబాబ్స్‌లో వాడే ఫుడ్ కలర్స్‌పై నిషేధం!

Karnataka Government Banned Food Color Using in Kebabs: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార పదార్థాల్లో వాడే ఫుడ్ కలర్స్ పై నిషేధం విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటన విడుదల చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని రెస్టారెంట్లు, హోటళ్లలో ముఖ్యంగా చికెన్ కు సంబంధించిన కబాబ్, ఫిష్ కబాబ్, వంటి రకరకాల వంటకాల్లో ఉపయోగిస్తున్న ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్ల వినియోగంపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం కేవలం ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపకుండా ఉండాలనే ఉద్ధేశ్యంతోనే చేసినట్లు ప్రకటనలో పేర్కొంది.


ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీనికి 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 10 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మరోవైపు కర్ణాటకలో ఫుడ్ స్టాల్స్ లో ఇటీవల సోదాలు ముమ్మరం చేశారు. ఎక్కడ చూసిన కల్తీ ఆహారాన్ని విక్రయిస్తున్నారని వస్తున్న విమర్శల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకంపై ప్రజల నుంచి పలుమార్లు ఫిర్యాదులు అందడంతో అధికారులు కబాబ్స్ నుంచి శాంపుల్స్ తీసుకుని టెస్ట్ కు పంపించారు.

Also Read: ఎమర్జెన్సీ నాటి ‘నస్బందీ’ ప్రచారానికి సంజయ్ గాంధీ ఎలా నాయకత్వం వహించారు?


టెస్ట్‌లో ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకం విపరీతంగా పెరిగిందని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే కర్ణాటకలో మంచురియాను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. పీచు మిఠాయి, మంచురియాలలో ఎక్కువగా ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకం పెరిగిందని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Related News

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Bihar Assembly Election 2025: బీహార్‌ తొలి విడత పోలింగ్‌.. 121 స్థానాలకు బరిలో 1,314 మంది

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Delhi Politics: ఓట్‌ చోరీపై కొత్త బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ.. బ్రెజిల్‌ మోడల్‌‌కు ఓటు హక్కు, హవ్వా

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

Big Stories

×