E-Paper
Advertisement

Karnataka Government on Kebabs: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. కబాబ్స్‌లో వాడే ఫుడ్ కలర్స్‌పై నిషేధం!

Karnataka Government on Kebabs: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. కబాబ్స్‌లో వాడే ఫుడ్ కలర్స్‌పై నిషేధం!

Karnataka Government Banned Food Color Using in Kebabs: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార పదార్థాల్లో వాడే ఫుడ్ కలర్స్ పై నిషేధం విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటన విడుదల చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని రెస్టారెంట్లు, హోటళ్లలో ముఖ్యంగా చికెన్ కు సంబంధించిన కబాబ్, ఫిష్ కబాబ్, వంటి రకరకాల వంటకాల్లో ఉపయోగిస్తున్న ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్ల వినియోగంపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం కేవలం ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపకుండా ఉండాలనే ఉద్ధేశ్యంతోనే చేసినట్లు ప్రకటనలో పేర్కొంది.

ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీనికి 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 10 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మరోవైపు కర్ణాటకలో ఫుడ్ స్టాల్స్ లో ఇటీవల సోదాలు ముమ్మరం చేశారు. ఎక్కడ చూసిన కల్తీ ఆహారాన్ని విక్రయిస్తున్నారని వస్తున్న విమర్శల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకంపై ప్రజల నుంచి పలుమార్లు ఫిర్యాదులు అందడంతో అధికారులు కబాబ్స్ నుంచి శాంపుల్స్ తీసుకుని టెస్ట్ కు పంపించారు.

Also Read: ఎమర్జెన్సీ నాటి ‘నస్బందీ’ ప్రచారానికి సంజయ్ గాంధీ ఎలా నాయకత్వం వహించారు?

టెస్ట్‌లో ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకం విపరీతంగా పెరిగిందని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే కర్ణాటకలో మంచురియాను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. పీచు మిఠాయి, మంచురియాలలో ఎక్కువగా ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకం పెరిగిందని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×