E-Paper
Advertisement

Karnataka Government on Kebabs: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. కబాబ్స్‌లో వాడే ఫుడ్ కలర్స్‌పై నిషేధం!

Karnataka Government on Kebabs: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. కబాబ్స్‌లో వాడే ఫుడ్ కలర్స్‌పై నిషేధం!
Advertisement

Karnataka Government Banned Food Color Using in Kebabs: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార పదార్థాల్లో వాడే ఫుడ్ కలర్స్ పై నిషేధం విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటన విడుదల చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని రెస్టారెంట్లు, హోటళ్లలో ముఖ్యంగా చికెన్ కు సంబంధించిన కబాబ్, ఫిష్ కబాబ్, వంటి రకరకాల వంటకాల్లో ఉపయోగిస్తున్న ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్ల వినియోగంపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం కేవలం ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపకుండా ఉండాలనే ఉద్ధేశ్యంతోనే చేసినట్లు ప్రకటనలో పేర్కొంది.

ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీనికి 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 10 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మరోవైపు కర్ణాటకలో ఫుడ్ స్టాల్స్ లో ఇటీవల సోదాలు ముమ్మరం చేశారు. ఎక్కడ చూసిన కల్తీ ఆహారాన్ని విక్రయిస్తున్నారని వస్తున్న విమర్శల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకంపై ప్రజల నుంచి పలుమార్లు ఫిర్యాదులు అందడంతో అధికారులు కబాబ్స్ నుంచి శాంపుల్స్ తీసుకుని టెస్ట్ కు పంపించారు.

Advertisement

Also Read: ఎమర్జెన్సీ నాటి ‘నస్బందీ’ ప్రచారానికి సంజయ్ గాంధీ ఎలా నాయకత్వం వహించారు?

టెస్ట్‌లో ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకం విపరీతంగా పెరిగిందని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే కర్ణాటకలో మంచురియాను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. పీచు మిఠాయి, మంచురియాలలో ఎక్కువగా ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకం పెరిగిందని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×