E-Paper
Advertisement

Karur Stampede : విజయ్ ఇచ్చిన రూ.20 లక్షల పరిహారం తిరస్కరించిన మృతుడి భార్య!

Karur Stampede : విజయ్ ఇచ్చిన రూ.20 లక్షల పరిహారం తిరస్కరించిన మృతుడి భార్య!
Advertisement

Karur stampede: గత నెల(సెప్టెంబర్) 27న తమిళనాడులోని కరూర్ జిల్లాలో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందగా, దాదాపు 100 మంది గాయపడ్డ సంగతి తెలిసిందే. 41 మంది మృతుల కుటుంబాలకు విజయ్ ఒక్కో కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారాన్ని అందజేశారు.

ఈ ఘటనలో మరణించిన రమేష్ భార్య శంకవి పెరుమాళ్, నటుడు విజయ్ అందించిన రూ. 20 లక్షల ఆర్థిక సహాయాన్ని తిరస్కరించారు. ఈ మొత్తాన్ని ఆమె ఆర్‌టీజీఎస్ ద్వారా వెనక్కి పంపించారు.

Advertisement

READ ALSO: Dhaka plot to kill Modi: మోదీపై అమెరికా భారీ కుట్ర.. చివరి నిమిషంలో హెచ్చరించిన పుతిన్?

తొక్కిసలాటలో 41 మంది మరణించగా, విజయ్ మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అయితే, బాధితులను పరామర్శించడానికి విజయ్ నేరుగా కరూర్‌కు రాకపోవడం తనను తీవ్రంగా నిరాశపరిచిందని శంకవి ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

“విజయ్.. కరూర్ వచ్చి మమ్మల్ని పరామర్శిస్తారని భావించాను. కానీ దానికి బదులుగా, సోమవారం మమ్మల్ని మామల్లపురంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌కు పిలిపించారు. నాకు తెలియకుండానే నా భర్త కుటుంబ సభ్యులను టీవీకే నేతలు అక్కడికి తీసుకెళ్లారు. ఆయన కరూర్ రాకపోవడం నన్ను బాధించింది, అందుకే ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాను” అని శంకవి స్పష్టం చేశారు.

ఈ ఘటన సోమవారం మామల్లపురంలో విజయ్ బాధితుల కుటుంబాలను కలుసుకున్న రోజే జరగడం గమనార్హం. అయితే, శంకవి నిర్ణయం వెనుక స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడి ఉండవచ్చని టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు.

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×