BigTV English
Advertisement

Karur stampede : విజయ్ ఇచ్చిన రూ. 20 లక్షల పరిహారం తిరస్కరించిన బాధితురాలి భార్య!

Karur stampede : విజయ్ ఇచ్చిన రూ. 20 లక్షల పరిహారం తిరస్కరించిన బాధితురాలి భార్య!

Karur stampede: గత నెల(సెప్టెంబర్) 27న తమిళనాడులోని కరూర్ జిల్లాలో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందగా, దాదాపు 100 మంది గాయపడ్డ సంగతి తెలిసిందే. 41 మంది మృతుల కుటుంబాలకు విజయ్ ఒక్కో కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారాన్ని అందజేశారు.


ఈ ఘటనలో మరణించిన రమేష్ భార్య శంకవి పెరుమాళ్, నటుడు విజయ్ అందించిన రూ. 20 లక్షల ఆర్థిక సహాయాన్ని తిరస్కరించారు. ఈ మొత్తాన్ని ఆమె ఆర్‌టీజీఎస్ ద్వారా వెనక్కి పంపించారు.

READ ALSO: Dhaka plot to kill Modi: మోదీపై అమెరికా భారీ కుట్ర.. చివరి నిమిషంలో హెచ్చరించిన పుతిన్?


తొక్కిసలాటలో 41 మంది మరణించగా, విజయ్ మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అయితే, బాధితులను పరామర్శించడానికి విజయ్ నేరుగా కరూర్‌కు రాకపోవడం తనను తీవ్రంగా నిరాశపరిచిందని శంకవి ఆవేదన వ్యక్తం చేశారు.

“విజయ్.. కరూర్ వచ్చి మమ్మల్ని పరామర్శిస్తారని భావించాను. కానీ దానికి బదులుగా, సోమవారం మమ్మల్ని మామల్లపురంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌కు పిలిపించారు. నాకు తెలియకుండానే నా భర్త కుటుంబ సభ్యులను టీవీకే నేతలు అక్కడికి తీసుకెళ్లారు. ఆయన కరూర్ రాకపోవడం నన్ను బాధించింది, అందుకే ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాను” అని శంకవి స్పష్టం చేశారు.

ఈ ఘటన సోమవారం మామల్లపురంలో విజయ్ బాధితుల కుటుంబాలను కలుసుకున్న రోజే జరగడం గమనార్హం. అయితే, శంకవి నిర్ణయం వెనుక స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడి ఉండవచ్చని టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు.

Related News

Cloud Seeding over Delhi: కృత్రిమ వర్షం కోసం క్లౌడ్ సీడింగ్ నిర్వహించిన ఢిల్లీ ప్రభుత్వం

Dhaka plot to kill Modi: మోదీపై అమెరికా భారీ కుట్ర.. చివరి నిమిషంలో హెచ్చరించిన పుతిన్?

Youth Catches Cops: ‘‘చట్టం అందరికీ సమానమే’’.. నడి రోడ్డుపై పోలీసులను నిలదీసిన యువకుడు

Fact Check: రోజుకు రూ.60 వేల ఆదాయం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరిట ఫేక్ వీడియో వైరల్

PM Kisan 21st Installment: పీఎం కిసాన్ పై బిగ్ అప్డేట్.. 21వ విడత డబ్బులు పడేది అప్పుడే

Cyber Crime: ముగ్గురు సోదరీమణుల ఏఐ జనరేటేడ్ ఫోటోలతో బ్లాక్‌మెయిల్.. ఆత్మహత్య చేసుకున్న సోదరుడు!

SIR:12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్‌.. ఈసీ కీలక ప్రకటన

Big Stories

×