E-Paper
Advertisement

Delhi Politics: ఈనెల చివర్లో బీజేపీ అధ్యక్షుడి ఎంపిక.. రేసులో కిషన్ రెడ్డి-పురందేశ్వరి పేర్లు

Delhi Politics: ఈనెల చివర్లో బీజేపీ అధ్యక్షుడి ఎంపిక.. రేసులో కిషన్ రెడ్డి-పురందేశ్వరి పేర్లు
Advertisement

Delhi Politics: బీజేపీ అధ్యక్ష పీఠం ఈసారి దక్షిణాది వారికి దక్కుతుందా? తెలుగు రాష్ట్రాల నుంచి పోటీ ఎక్కువగా ఉందా? తమిళనాడుకి చెందిన నేతలు డ్రాపయ్యారా? ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడమే అందుకు కారణమా? ఇంతకీ తెలుగు రాష్ట్రాల నుంచి రేసులో ఉన్నదెవరు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

ఈనెల చివర్లో బీజేపీ అధ్యక్షుడి ఎంపిక?

Advertisement

యూపీ అధ్యక్షుడి ఎంపిక ఈనెల లేదా వచ్చే నెలలో పూర్తి కానుంది. తర్వాత బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరన్నది తేలిపోనుంది. మళ్లీ ఏప్రిల్ లేదా మే వరకు రాష్ట్రాల ఎన్నికలు లేకపోవడంతో అధ్యక్షుడి ఎంపికపై బీజేపీ పెద్దలు ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.

అన్ని రాష్ట్రాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. మిగతా రాష్ట్రాలు ఎలా ఉన్నా తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి భిన్నంగా ఉండడంతో ఇక్కడి నుంచి ఓ వ్యక్తిని ఎంపిక చేయాలని భావిస్తోందట పార్టీ హైకమాండ్. అందులో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేరు బలంగా వినిపిస్తున్నట్లు ఢిల్లీ పొలిటికల్ వర్గాల సమాచారం.

Advertisement

అధ్యక్షుడి రేసులో కిషన్‌రెడ్డి-పురందేశ్వరి

అందుకు కారణాలు లేకపోలేదు. తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి వేరుగా ఉంది. ఇలాంటి సమయంలో కిషన్‌రెడ్డి అధ్యక్ష పీఠంపై కూర్చొబెడితే మంచి ఫలితాలు వస్తాయన్నది ఆ పార్టీ ఆలోచన గా కొందరు నేతలు చెబుతున్నారు. ఎందుకంటే పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్నారు. అందులోనూ యువకులను ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందని హైకమాండ్ ఆలోచనగా చెబుతున్నారు.

ఈ క్రమంలో ఆయన పేరును కొందరు సూచించినట్టు చెబుతున్నారు. ఈ పదవి రేసులో మాజీ కేంద్రమంత్రి, ఎంపీ పురందేశ్వరి ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో ఇప్పటివరకు మహిళలు అధ్యక్ష పీఠంపై కూర్చున్న సందర్భాలు లేవు. రాష్ట్రపతి, ఢిల్లీ ముఖ్యమంత్రిగా మహిళలకు అవకాశం ఇచ్చింది బీజేపీ. పార్టీ అధ్యక్షురాలిగా ఆమెకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని మరికొందరు భావిస్తున్నారట.

ALSO READ:  శబరిమలలో రచ్చ.. తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారుల దాడి

దీనివల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీకి మాంచి ఊపు వస్తుందని అంటున్నారు. ఈ రెండు పేర్లలో ఎవరో ఒకరు ఓకే కావడం ఖాయమని అంటున్నారు. ఒకవేళ కిషన్‌రెడ్డి అధ్యక్షుడిగా ఎంపికైతే, కేంద్రమంత్రిగా పురందేశ్వరికి అవకాశం రావచ్చని అంటున్నారు. ఈ సస్పెన్ష్‌కు తెరపడాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×