BMC Election Results 2025-26: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభంజనం సృష్టించింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)తో సహా మెజారిటీ స్థానాల్లో ఈ కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
ముంబైలోని మొత్తం 227 వార్డులకు గానూ, మహాయుతి కూటమి 116 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, శివసేన (UBT) కూటమి 85 స్థానాల్లో ముందంజలో ఉంది. మొత్తం 29 మున్సిపల్ కార్పొరేషన్లలో జరిగిన ఎన్నికలలో, బీజేపీ, దాని మిత్రపక్షాలు 25 చోట్ల నిర్ణయాత్మక విజయాన్ని అందుకున్నాయి.
పుణె మరియు పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ ఎన్నికల్లో శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు కలిసి వ్యూహాత్మకంగా పోటీ చేసినప్పటికీ, ఓటర్లు వారిని ఆదరించలేదు. పుణె రాజకీయాల్లో ‘పవార్ బ్రాండ్’ మునుపటిలా ప్రభావం చూపలేకపోయింది.
“మహారాష్ట్ర ప్రజలు బీజేపీపై పూర్తి విశ్వాసాన్ని ప్రదర్శించారు. ఈ విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తున్నాను. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకానికి ఇది నిదర్శనం.” అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
“ముంబై వాసులు అభివృద్ధిని కోరుకుంటున్నారని ఈ ఫలితాలు నిరూపించాయి. భావోద్వేగ రాజకీయాలను కాకుండా సౌకర్యాలు, అభివృద్ధిని ప్రజలు ఎంచుకున్నారు. ముంబై మరాఠీ మనుషులది.” అని డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే అన్నారు.
ముంబై మౌలిక సదుపాయాల మెరుగుదల మరియు మెట్రో పనుల వేగం కూటమికి కలిసొచ్చింది. శివసేన (షిండే వర్గం), బీజేపీ మరియు ఎన్సీపీ (అజిత్ పవార్) కలిసి పోటీ చేయడం వల్ల ఓట్లు చీలకుండా పోలయ్యాయి.మహా వికాస్ అఘాడీ (MVA) లోని అంతర్గత విభేదాలు, ముఖ్యంగా పుణె వంటి నగరాల్లో ఓటర్లను ఆకర్షించలేకపోయాయి.
Read Also: అమెజాన్ అడవుల్లో వింత లోకం.. బాహ్య ప్రపంచానికి తెలియని తెగ కెమెరా కంటికి చిక్కిందిలా!