E-Paper
Advertisement

Bhupalpalli: రోడ్డుపై కారు దగ్ధం.. చెలరేగిన మంటలు, మేడారం వెళ్లి వస్తుండగా ఘటన

Bhupalpalli: రోడ్డుపై కారు దగ్ధం.. చెలరేగిన మంటలు, మేడారం వెళ్లి వస్తుండగా ఘటన
Advertisement

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలం మేడిపల్లి టోల్ గేట్ సమీపంలో శుక్రవారం ఒక కారు ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. వరంగల్ నుండి మేడారం సమ్మక్క-సారలమ్మల దర్శనం ముగించుకుని.. కాళేశ్వరం వైపు వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

కారు మేడిపల్లి టోల్ గేట్ వద్దకు చేరుకోగానే ఇంజిన్ నుండి ఒక్కసారిగా పొగలు రావడం గమనించిన డ్రైవర్, వెంటనే అప్రమత్తమై కారును నిలిపివేశాడు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు క్షణాల్లో కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వారు కారు దిగిన నిమిషాల వ్యవధిలోనే మంటలు కారు మొత్తానికి వేగంగా వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Advertisement

స్పందించిన ఫైర్ సిబ్బంది..

సమాచారం అందుకున్న వెంటనే కాటారం పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ.. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదం కారణంగా రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మేడారం దర్శనం ముగించుకుని సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్తుండగా జరిగిన ఈ ఘటనతో బాధితులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అయినప్పటికీ, ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

ALSO READ: Dharani Fraud: ధరణి పోర్టల్‌లో భారీ కుంభకోణం.. మొత్తం 1,080 రిజిస్ట్రేషన్లలో ఫ్రాడ్, 15 మంది నిందితుల అరెస్ట్

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×