BigTV English
Advertisement

Mallikarjun Kharge: ‘రైల్వే ప్రమాదాలు నివారించండి.. వెంటనే కవచ్ టెక్నాలజీని ఇన్‌స్టాల్ చేయండి’

Mallikarjun Kharge: ‘రైల్వే ప్రమాదాలు నివారించండి.. వెంటనే కవచ్ టెక్నాలజీని ఇన్‌స్టాల్ చేయండి’

Mallikarjun Kharge| ఉత్తర్ ప్రదేశ్ లోని గోండాలో గురువారం జరిగిన చండీగడ్ – దిబ్రుగడ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. చాలామందికి తీవ్ర గాయలయ్యాయి. ఈ దుర్ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ నవ్.. రైల్వే ప్రమాదాలకు పూర్తిగా బాధ్యత వహించాలని అన్నారు.


”చండీగడ్ – దిబ్రుగడ్ ఎక్స్ ప్రెస్ రైలు.. ఉత్తర్ ప్రదేశ్ లో పట్టాలు తప్పిన ప్రమాదం.. ఒక్కటే కాదు.. ఇటీవల రైలు ప్రమాదాలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. మోదీ ప్రభుత్వం రైల్వే శాఖ భద్రత పట్ల నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనం” అని ఖర్గే సోషల్ మీడియాలో అధికారికంగా పోస్టు చేశారు.

Thief Returns Loot: ‘మీ ఇల్లు అని తెలీక దొంగతనం చేశాను.. సారీ’.. లెటర్ రాసి సొమ్మును తిరిగి ఇచ్చేసిన విచిత్ర దొంగ!


“ఒక నెల క్రితమే.. సీల్ దా – అగర్ తలా కంచన్‌జంగా ఎక్సెప్రెస్ ఒక గూడ్స్ రైలుతో ఢీ కొనడంతో 11 మంది చనిపోయారు. దీనిపై రైల్వే భద్రతా కమిషనర్.. ఇలాంటివి జరుగుతూ ఉంటాయని చెప్పారు. కానీ విచారణ రిపోర్టు ప్రకారం… ఆటోమేటిక్ సిగ్నల్స్ విఫలం కావడం, మల్టిపుల్ లెవెల్ ఆపరేషన్స్ జాప్యం జరగడం, ట్రైన్ మెనేజర్, లోకొ పైలట్ వద్ద వాకీ టాకీ లాంటి సరైన సేఫ్టీ ఎక్విప్‌మెంట్ లేకపోవడమే కారణాలని తెలిసింది. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు,” అని ఖర్గే మండిపడ్డారు.

”ప్రధాని నరేంద్ర మోదీ, అతని రైల్వే మంత్రి.. ఇద్దరూ తాము చేసిన గొప్పలని చెప్పుకోవడానికి ఏ చిన్న అవకాశం కూడా వదలరు. మరి ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాలకు వారు నేరుగా బాధ్యత వహిస్తారా?,” అని ప్రశ్నించారు.

ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి వెంటనే రైల్వే శాఖలో కవచ్ యాంటీ కొలిజన్ టెక్నాలజీని మెరుగైన భద్రత కోసం ఉపయోగించడం మొదలుపెట్టాలని ఖర్గే సూచించారు.

Related News

Cyber Security Bureau: దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా ఆపరేషన్.. 81 మంది అరెస్ట్

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Big Stories

×