BigTV English

Manipur: మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత!

Manipur: మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత!

Manipur army stopped by women protestors: మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేసేందుకు అధికారులు ప్రయత్నించా ఫలితం లేకుండాపోయింది. ఇందుకు సంబంధించి అధికారుల వివరాల ప్రకారం.. మణిపూర్ లోని బిష్ణుపూర్ జిల్లా కుంభీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సైనిక సిబ్బందిని వందలాదిమంది మహిళలు అడ్డుకున్నారు. వారి వద్ద ఉన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.


అయితే, గత ఏడాది మేలో మొదలైన అల్లర్లు ముగిసేవరకు ఎలాంటి ఆయుధాలు జప్తు చేయొదన్నారు. ఈ క్రమంలో వారు రోడ్డుకు అడ్డం తిరిగి ఆర్మీ కాన్వాయ్ ను కదలనీయకుండా అడ్డుకున్నారు. అయితే, వారిని చెదరగొట్టేందుకు బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. అయినా కూడా వారు అక్కడి నుంచి కదలకపోవడంతో విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ ఆయుధాలను పోలీసులకు ఇస్తామని సైనిక సిబ్బంది చెప్పడంతో వారు శాంతించారు.

Also Read: ‘కలలు కనకండి.. ఎప్పటికీ అలా జరగనివ్వం’


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కుంభీ వంటి సరిహద్దు ప్రాంతంలో కాపలాగా ఉన్న గ్రామ వాలంటీర్ల వద్ద నుంచి ఆయుధాలను జప్తు చేయడం వల్ల చురాచాంద్ పుర్ జిల్లా పక్కనే ఉన్న కొండ ప్రాంతాల నుంచి సాయుధ మిలిటెంట్లు దాడులు చేసే అవకాశముందంటూ వారు పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం అక్కడ సాధారణ స్థితి నెలకొన్నదని, ఈ నేపథ్యంలో అక్కడి నుంచి సైనిక సిబ్బంది వెనుదిరిగారని అధికారులు తెలిపినట్లు సమాచారం.

Tags

Related News

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Big Stories

×