MGNREGA Days Hike: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరును కేంద్రం మార్చింది. ఉపాధి హామీ పేరును ‘పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజన’గా మారుస్తూ శుక్రవారం కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే ఉపాధి హామీ పనిదినాల సంఖ్యను 100 నుంచి 125 రోజులకు పెంచింది. ఒక రోజుకు ఇచ్చే కనీస వేతనాన్ని రూ.240కు పెంచింది.
కేంద్ర ప్రభుత్వం 2006 ఫిబ్రవరిలో ప్రపంచంలోనే అతి పెద్ద ఉపాధి కార్యక్రమాన్ని ప్రారభించింది. గ్రామాల్లో శ్రామికులకు సంవత్సరంలో కనీసం వంద రోజులపాటు పని కల్పించాలని నిర్ణయించింది. డిసెంబర్ 12న కేంద్ర ప్రభుత్వం MGNREGA పేరు మార్పును ఆమోదించింది.
కనీస ఉపాధి రోజుల సంఖ్యను 125 రోజులకు పెంచింది. అంతేకాకుండా, కనీస వేతనాన్ని రోజుకు రూ. 240కి సవరించింది. ఈ పథకాన్ని మొదటిగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 (NREGA) పేరుతో ప్రారంభించారు. తరువాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)గా పేరు మార్చారు. సామాజిక భద్రతలో భాగంగా ‘పని హక్కు’ హామీ ఇస్తున్న కార్మిక చట్టం.
గ్రామీణ భారతదేశంలో నైపుణ్యం లేని వారి జీవనోపాధి భద్రతను పెంచడం ఈ కార్యక్రమం ప్రాథమిక లక్ష్యం. ప్రతి ఇంట్లో ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఏడాదిలో 100 రోజుల పని కల్పించాలి.
Also Read: PM WANI: ఉచిత ఇన్ స్టాలేషన్ తో రూ.150కే వైఫై.. పీఎం వాణి పథకం గురించి తెలుసా?