BigTV English

Kavitha: ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీలో హైటెన్షన్

Kavitha: ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీలో హైటెన్షన్

Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు లాయర్‌తో కలిసి ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈక్రమంలో ఈడీ ఆఫీస్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు. ఈడీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో పలు ఆంక్షలు విధించారు. 144 సెక్షన్ అమలు చేశారు.


ఇక ఈ కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్న వారితో కలిసి కవితన ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. రామచంద్ర పిళ్లై, మనిశ్ సిసోడియాను ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ కేసులో 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. ఈక్రమంలో కవితను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు కవితకు నైతిక మద్ధతు తెలియజేయడానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు, మంత్రులు ఢిల్లీలోని కవిత నివాసానికి చేరుకున్నారు. శుక్రవారం మంత్రి హరీశ్‌రావు, కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. న్యాయనిపుణులతో కేటీఆర్ భేటీ కానున్నారు.


Tags

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×