BigTV English

Modi : పట్టాలపైకి మరో 5 వందే భారత్ రైళ్లు.. భోపాల్ నుంచి ప్రారంభించిన మోదీ..

Modi : పట్టాలపైకి మరో 5 వందే భారత్ రైళ్లు.. భోపాల్ నుంచి ప్రారంభించిన మోదీ..

Modi : వందే భారత్‌ రైళ్ల ప్రస్థానంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఒకే రోజు 5 కొత్త వందే భారత్‌ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టాయి. ప్రధాని మోదీ ఈ రైళ్లను భోపాల్ నుంచి ప్రారంభించారు.


మంగళవారం ఉదయం భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌ కు ప్రధాని మోదీ చేరుకున్నారు. భోపాల్‌-జబల్‌పుర్‌, ఖజురహో-భోపాల్‌-ఇండోర్, హతియా-పాట్నా, ధార్వాడ్‌-బెంగళూరు, గోవా-ముంబై వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు జెండా ఊపారు. రెండు రైళ్లకు డైరెక్ట్ గా జెండా ఊపారు. మిగతా 3 రైళ్లను వర్చువల్‌ విధానంలో మోదీ ప్రారంభించారు. ఈ సమయంలో వందే భారత్‌ రైల్లో చిన్నారులతో సరదాగా ముచ్చటించారు.

ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్‌ మంగుభాయ్‌ పటేల్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహన్‌, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు వందేభారత్ రైళ్లు ప్రారంభించడం విశేషం.


Related News

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Big Stories

×