E-Paper
Advertisement

Modi : పట్టాలపైకి మరో 5 వందే భారత్ రైళ్లు.. భోపాల్ నుంచి ప్రారంభించిన మోదీ..

Modi : పట్టాలపైకి మరో 5 వందే భారత్ రైళ్లు.. భోపాల్ నుంచి ప్రారంభించిన మోదీ..
Advertisement

Modi : వందే భారత్‌ రైళ్ల ప్రస్థానంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఒకే రోజు 5 కొత్త వందే భారత్‌ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టాయి. ప్రధాని మోదీ ఈ రైళ్లను భోపాల్ నుంచి ప్రారంభించారు.

మంగళవారం ఉదయం భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌ కు ప్రధాని మోదీ చేరుకున్నారు. భోపాల్‌-జబల్‌పుర్‌, ఖజురహో-భోపాల్‌-ఇండోర్, హతియా-పాట్నా, ధార్వాడ్‌-బెంగళూరు, గోవా-ముంబై వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు జెండా ఊపారు. రెండు రైళ్లకు డైరెక్ట్ గా జెండా ఊపారు. మిగతా 3 రైళ్లను వర్చువల్‌ విధానంలో మోదీ ప్రారంభించారు. ఈ సమయంలో వందే భారత్‌ రైల్లో చిన్నారులతో సరదాగా ముచ్చటించారు.

Advertisement

ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్‌ మంగుభాయ్‌ పటేల్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహన్‌, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు వందేభారత్ రైళ్లు ప్రారంభించడం విశేషం.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×