E-Paper
Advertisement

Kochi Helicopter Crash :  నేవీ కేంద్రంలో ప్రమాదం.. నావికుడు మృతి..

Kochi Helicopter Crash :  నేవీ  కేంద్రంలో ప్రమాదం.. నావికుడు మృతి..

Kochi Helicopter Crash : కొచ్చి నావికా కేంద్రంలో శనివారం చేతక్ హెలికాప్టర్ కుప్పకూలడంతో నౌకాదళ అధికారి ఒకరు మృతి చెందారు. చాపర్ రోటర్ బ్లేడ్లు తగలడంతో రన్‌వేపై ఉన్న నౌకాదళ అధికారి మృతి చెందినట్లు నేవీ అధికారులు తెలిపారు. సౌత్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్‌లోని ఐఎన్‌ఎస్ గరుడ రన్‌వేపై శనివారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

మృతుడు మధ్యప్రదేశ్‌కు చెందిన గ్రౌండ్‌ స్టాఫ్‌ యోగేంద్ర సింగ్‌గా గుర్తించారు. ప్రమాదంపై దక్షిణ నావికాదళం విచారణకు ఆదేశించింది. నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ యోగేంద్ర సింగ్‌ మృతికి సంతాపం ప్రకటించారు.

ఐఎన్‌ఎస్ గరుడ.. ఐఎన్‌ఎస్ వెందురుతి, సదరన్ నేవల్ కమాండ్ ప్రధాన కార్యాలయం పక్కనే ఉంది. ఐఎన్‌ఎస్ గరుడ ఒక ప్రధాన నౌకాదళ వైమానిక శిక్షణా కేంద్రం, కార్యాచరణ స్థావరం. ఐఎన్‌ఎస్ గరుడలో రెండు ఇంటర్సెక్టింగ్ రన్‌వేలు ఉన్నాయి. దాదాపు అన్ని ఆపరేషనల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ల్యాండ్ చేయడానికి, టేకాఫ్ చేయడానికి అనుమతిస్తుంది. ఐఎన్‌ఎస్ గరుడ భారత నౌకాదళానికి వ్యూహాత్మక ఆపరేటింగ్ స్టేషన్‌.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×