E-Paper
Advertisement

NDA : ఢిల్లీలో ఎన్డీఏ కీలక సమావేశం.. పాత మిత్రులకు ఆహ్వానం..

NDA : ఢిల్లీలో ఎన్డీఏ కీలక సమావేశం.. పాత మిత్రులకు ఆహ్వానం..

NDA meeting in delhi today(BJP India latest news): ఢిల్లీ వేదికగా మంగళవారం ఎన్డీఏ కీలక భేటీ జరగబోతోంది. ప్రతిపక్షాల ఐక్యతా సమావేశానికి ధీటుగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. గతంలో దూరమైన మిత్ర పక్షాలను అక్కున చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఎన్డీఏ సమావేశానికి ఏర్పాట్లు చేసింది. ఈ భేటీకి 38 పార్టీలు హాజరవుతాయని బీజేపీ నేతలు తెలిపారు.

లోక్‌సభ ఎన్నికలకు ఇంకా 9 నెలలే సమయం ఉంది. ఒకవైపు 9 ఏళ్ల మోదీ పాలనలో అమలు చేసిన పథకాలు , చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమాలను బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టింది. మరోవైపు కొత్త పొత్తుల కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. కొత్త పార్టీలను ఎన్డీఏలోకి ఆహ్వానిస్తోంది. గతంలో ఎన్డీఏలో ఉండి తర్వాత బయటికి వెళ్లిన పార్టీలను తిరిగి కలుపుకునే చర్యలు చేపట్టింది.

ఎన్డీఏలో తిరిగి చేరుతున్నట్లు సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓపీ రాజ్‌భర్ తాజాగా ప్రకటించారు. 2019లో ఎన్డీఏ నుంచి ఆయన బయటకు వచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతంలో ఓబీసీ ఓటర్లపై రాజ్‌భర్‌కు పట్టు ఉంది. ఇక బిహార్‌లో లోక్‌ జనశక్తి పార్టీలో చీలిక తెచ్చిన చిరాగ్ పాశ్వాన్‌ను కూడా ఢిల్లీలో జరిగే ఎన్డీఏ సమావేశానికి జేపీ నడ్డా ఆహ్వానించారు. ఏపీ నుంచి జనసేనను ఆహ్వానించారు.

బిహార్ సీఎం నేతృత్వంలోని జేడీయూ, ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, అకాలీ దళ్ లాంటి పార్టీలు బీజేపీతో విభేదించి ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్నాయి. AIDMKను, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీలు, నాయకులను ఎన్​డీఏ సమావేశానికి జేపీ నడ్డా ఆహ్వానించారు. ప్రధానిగా మోదీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఎన్డీఏ భేటీ జరగనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. అటు బెంగళూరులో విపక్షాల సమావేశం రెండోరోజు జరగనుంది.

Related News

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

Big Stories

×