E-Paper
Advertisement

No abnormal difference in NEET Result: నీట్ ఫలితాల్లో పెద్ద తేడా ఏం లేదు: ఎన్టీఏ

No abnormal difference in NEET Result: నీట్ ఫలితాల్లో పెద్ద తేడా ఏం లేదు: ఎన్టీఏ

No abnormal difference in NEET-UG Result this year: నీట్ పరీక్ష అక్రమాల వ్యవహారంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. నీట్ పేప్ లీకైన మాట వాస్తవమేనంటూ ధర్మాసనం కూడా పేర్కొన్నది. అయితే, నీట్ ఫలితాల విషయమై ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఏడాది విడుదలైన నీట్ యూజీ ఫలితాల్లో పెద్ద తేడా ఏమీ లేదని వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు తెలిపినట్లు తెలుస్తోంది.

2020 నుంచి 2024 వరకు నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల మార్కులను పరిశీలించామని, అయితే.. సగటు స్కోర్ కు అనుగుణంగానే కటాఫ్ మార్కులు ఉన్నాయని ఎన్టీఏ తెలిపింది. వాటితో పోలిస్తే ఈ ఏడాది విడుదలైన ఫలితాల్లో భిన్నమైన తేడా ఏమీ లేదని పేర్కొన్నది. పరీక్ష పోటీతత్వం, అభ్యర్థుల ప్రదర్శన ఆధారంగా ప్రతి ఏడాది కటాఫ్ మార్కులు ఉంటాయని స్పష్టం చేసింది.

2020లోనూ కరోనా సమయంలో 13.6 లక్షలమంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 720 మార్కులకు గానూ సగటు స్కోర్ 297.18గా ఉందని వెల్లడించింది. ఆ సమయంలో జనరల్ కేటగిరీ కటాఫ్ 147.. ప్రస్తుత ఏడాదిలో సగటు స్కోర్ 323.55 కాగా, క్వాలిఫైయింగ్ మార్కులు 164 అని కోర్టుకు కోర్టుకు తెలిపింది. ఈసారి 23.33 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారని, ఈ స్థాయిలో హాజరుకావడం ఇదే తొలిసారి అని పేర్కొన్నది. అదేవిధంగా పేపర్ లీక్ ఆరోపణలు వచ్చిన కేంద్రాల్లో కూడా విద్యార్థుల మార్కుల్లో పెద్ద వ్యత్యాసం లేదని వెల్లడించినట్లు తెలుస్తోంది.

Also Read: నో కాంప్రమైజ్, చిక్కుల్లో ట్రైన్డ్ ఐఏఎస్.. వీఐపీ సదుపాయాల కోసం..

కాగా, నీట్ యూజీ ఎగ్జామ్ పేపర్ లీకైందని, అవకతవకలు, అక్రమాలు జరిగాయని.. అందువల్ల పరీక్షను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని భారత సీజేఐ (భారత ప్రధాన న్యాయమూర్తి) జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది. పేపర్ లీకైనమాట వాస్తవమేనని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. గ్రేస్ మార్కులు కలిపిన 1563 మందికి మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించిన సవరించిన నీట్ ర్యాంకుల జాబితాను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ విచారణ నేపథ్యంలో కౌన్సిలింగ్ ను కూడా వాయిదా వేసింది.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×