E-Paper
Advertisement

Parliament : పార్లమెంట్ లో విపక్షాల ఆందోళన.. హిండెన్‌బర్గ్‌ నివేదికపై చర్చకు పట్టు..

Parliament : పార్లమెంట్ లో విపక్షాల ఆందోళన.. హిండెన్‌బర్గ్‌ నివేదికపై చర్చకు పట్టు..
Advertisement

Parliament : అదానీ గ్రూప్‌ వ్యవహారంపై రెండోరోజు పార్లమెంట్‌ రడగ కొనసాగింది. విపక్షాల ఆందోళనతో ఉభయ సభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని హిండెన్‌బర్గ్‌
సంస్థ ఇచ్చిన నివేదికపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో పార్లమెంట్‌లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేపట్టాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేదా సీజేఐ ఆధ్వర్యంలోని కమిటీతో దర్యాప్తు జరిపించాలని కోరాయి. అదానీ వ్యవహారంపై చర్చకు లోక్‌సభ స్పీకర్ నిరాకరించారు. సభ్యులు నిరాధారమైన ఆరోపణలు చేయకూడదన్నారు. మరోవైపు రాజ్యసభ ఛైర్మన్ కూడా విపక్షాల వాయిదా తీర్మానాలను తోసిపుచ్చారు. దీంతో ప్రతిపక్ష నేతలు పార్లమెంట్ లో ఆందోళన చేపట్టారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య రాజ్యసభ, లోక్‌సభలో కార్యకలాపాలకు ఆటంకం కలిగింది.

Advertisement

రెండోరోజు పార్లమెంట్‌ సమావేశాలకు ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో విపక్ష పార్టీలన్నీ సమావేశం అయ్యాయి. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాయి. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ కార్యకలాపాల అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించాయి. చర్చకు పట్టుబట్టి ఆందోళనకు దిగాయి. ఇదే అంశంపై పార్లమెంట్ రగడ ఇంకా కొనసాగే అవకాశం ఉంది. అదానీ గ్రూప్ వ్యవహారాల అంశంపై చర్చ జరిగే వరకు విపక్షాలు ఆందోళనలు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. మరి అధికార పక్షం ఈ అంశాన్ని ఎలా డీల్ చేస్తుందో చూడాలి.

Related News

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

ఏడేళ్ల బంధం.. ఎండమావి అయింది.. ప్రియుడితో కలిసి భర్త తల నరికిన భార్య, ఎక్కడంటే?

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేతపై మహిళ ఇంకు దాడి.. అసలేం జరిగిందంటే?

తమిళనాడులో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ బస్సు.. 23 మంది ప్రయాణికులు ఎలా బతికారంటే?

కోయంబత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్లు పేలి 4 ఇళ్లు పూర్తిగా దగ్ధం!

Big Stories

Advertisement
×