E-Paper
Advertisement

Osama al-Mazini: హమాస్ మరో కీలక నేత మృతి

Osama al-Mazini: హమాస్ మరో కీలక నేత మృతి
Advertisement

Osama al-Mazini: హమాస్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులు చేస్తోంది. సోమవారం ఒక్క రోజే గాజాలోని 200 హమాస్ సైనిక స్థావరాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో హమాస్ పొలిటికల్ బ్యూరో సీనియర్ నాయకుడు, షురా కౌన్సిల్ హెడ్ ఒసామా అల్-మజిని మృతి చెందినట్టు ఐడీఎఫ్, ఇజ్రాయెల్ భద్రతా సంస్థ షిన్‌బెట్ ఓ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.

ఐడీఎఫ్ సైనికుడు గిలాడ్ షాలిత్ అప్పగింత సమయంలో జరిగిన సంప్రదింపుల్లో మజిని కీలక పాత్ర పోషించారు. 2006లో హమాస్‌కు చిక్కిన షాలిత్ 2011 అక్టోబర్ వరకు బందిగా ఉన్నాడు. తమ చెరలో ఉన్న 1027 మంది పాలస్తీనియన్ ఖైదీలను విడిచిపెడతామని ఇజ్రాయెల్ హామీ ఇచ్చిన తర్వాతే షాలిత్‌కు చెర వీడింది. ఈ సందర్భంగా హమాస్ సంప్రదింపులు నెరపడంలో మజిని కీలకంగా వ్యవహరించారు.

Advertisement

గత 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజాలో హమాస్‌కు చెందిన 200 స్థావరాలు నేలమట్టమయ్యాయి. హమాస్ మిలిటెంట్లు వినియోగించే బ్యాంక్, ఆపరేషనల్ హెడ్‌క్వార్టర్స్, అండర్ గ్రౌండ్ టన్నెళ్లు వీటిలో ఉన్నాయి. గాజా సిటీలో నడిబొడ్డున ఉన్న హమాస్ భవనాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ నేవీ కూడా దాడులు చేసింది. ఆయుధాల నిల్వ చేసిన వేర్‌హౌస్‌లు ఆ భవనాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×