E-Paper
Advertisement

India: పాక్ జాతీయులకు టైమ్ క్లోజ్.. ఫైన్‌తోపాటు ఆపై జైలు

India: పాక్ జాతీయులకు టైమ్ క్లోజ్..   ఫైన్‌తోపాటు ఆపై జైలు
Advertisement

India: పహల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తానీయులు తమ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్రంం. లాంగ్ టర్న్ వీసా దారులకు ఇచ్చిన గడువు ఆదివారంతో ముగిసింది. దాదాపు పాక్ జాతీయులు ఆదేశానికి వెళ్లినట్టు సమాచారం. ఇంకా ఎవరైనా ఉంటే వారిపై కేంద్రం కొరడా ఝులిపించింది.

ఉండిపోయిన పాక్ జాతీయులపై కేంద్రం కొరడా

Advertisement

పహల్గాం ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత్‌ కఠిన చర్యలు చేపట్టింది. ఆదేశ వీసాల కింద భారత్‌లో ఉన్న పాక్‌ పౌరులను కేంద్రం ఇచ్చిన గడువు ముగిసింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే వారిపై కొరడా ఝులిపించనుంది. గడువు దాటినా తర్వాత భారత్‌లో ఉంటే వారిని అరెస్టు చేయవచ్చు. గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష, 3 లక్షల రూపాయల జరిమానా రెండూ విధించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

మూడు రకాల వీసాలపై భారత్‌లో వేలాది మంది పాకిస్థానీయులు ఉంటున్నారు. ఒకటి లాంగ్ టర్న్ వీసా, రెండోది ఆరోగ్యం మీద వచ్చిన వీసా.. మూడోది సార్క్ వీసాల కింద దాదాపు 12 వర్గాల ప్రజలు భారత్‌లో ఉంటున్నారు.  వ్యాపారం, సినిమా, జర్నలిస్టులు, ట్రాన్సిట్, కాన్ఫరెన్స్, ట్రెక్కింగ్, విద్యార్థి, సందర్శకులు, గ్రూప్ టూరిస్ట్ వీసాలు అందులో ఉన్నాయి.

Advertisement

సార్క్‌ వీసాల కింద వచ్చినవారికి గడువు ఏప్రిల్‌ 26తో ముగిసింది. లాంగ్ టర్న్ వీసాల మీద వచ్చినవారికి ఆదివారం(ఏప్రిల్ 27)వరకు గడువు ఇచ్చింది. అది కాస్త ముగిసిపోయింది. వైద్య వీసాల కింద వచ్చినవారికి మంగళవారం(ఏప్రిల్ 29)తో వారి గడువు ముగియనుంది.

ALSO READ: భారత్ ఆంక్షల ఎఫెక్ట్.. పాక్‌లో వాటర్ బాటిల్ ధర ఎంతో తెలుసా?

ఏప్రిల్‌ 4 నుంచి ‘ఇమిగ్రేషన్‌ అండ్‌ ఫారినర్స్‌ యాక్ట్‌- 2025’ అమల్లోకి వచ్చింది. గడువు తీరిపోయినా ఇక్కడే ఉండటం, వీసా నిబంధనలు ఉల్లంఘించడం, నిషేధిత ప్రాంతాలను సందర్శించడం వంటివి చేస్తున్నారు. వారికి మూడేళ్ల జైలు శిక్ష, 3 లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు కేంద్రప్రభుత్వం.

ప్రయాణంలో పాక్ పౌరులకు తప్పని ఇబ్బందులు

ఈ వ్యవహారంపై ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. విమానంలో వెళ్లాలంటే పాకిస్థాన్ గగన తలాన్ని మూసివేసింది. దీంతో స్వదేశానికి వెళ్లే పాకిస్తానీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  చాలామంది పంజాబ్ మీదుగా పాక్‌కు వెళ్తున్నారు. మరికొందరు అటారీ, వాఘా సరిహద్దు మీదుగా తిరుగుబాట పట్టారు.

మరికొందరు నేపాల్ వెళ్లి అక్కడి నుంచి విమానంలో వెళ్తున్నారు. గడిచిన మూడు రోజుల్లో 509 మంది ఈ సరిహద్దు ద్వారా దేశం దాటారు. మరోవైపు పాక్‌లో భారతీయులు 745 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. పహల్గామ్ ఉగ్రవాదుల దాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దేశానికి వచ్చినవారిని పంపడమే కాదు.. చివరకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన విషయం తెల్సిందే. మంగళవారం తర్వాత అన్నిరాష్ట్రాల వెళ్లిన పాక్ జాతీయుల లెక్క తేలనుంది. అప్పటికే కేంద్రం ఆదేశ పౌరులకు ఇచ్చిన గడువు ముగియనుంది. ఇంకా ఎవరైనా ఉంటే మాత్రం కష్టాలు తప్పవన్నమాట.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×