Parents who killed the young man who loved their daughter(Today’s news in telugu): ఉత్తర ప్రదేశ్లో ఓ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. తమ కుమార్తె పెళ్లికి అడ్డపడుతున్న యువకుడిని తల్లిదండ్రుల దారుణంగా చంపేశారు. మృతదేహం కారులో తరలించి దహనం చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని మథుర జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హథ్రాస్కు చెందిన పుష్పేంద్ర యాదవ్ అగ్రలో ఓ ట్రాన్స్పోర్టు వ్యాపారిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే 20ఏళ్ల డాలీ అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారిందది. వారి ప్రేమను పెద్దలు నిరాకరించడంతో పారిపోయి పెళ్లిచేసుకునేందుకు ప్రయత్నించారు.
ఈ నేపథ్యంలో యువతి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువకుడు ఆ సంబంధాలకు అడ్డుపడ్డాడు. దీంతో యువతి తల్లిదండ్రులు అవదేశ్, భూరీ దేవి తమ కుమార్తెతో పుష్రేంద్రకు ఫోన్ చేయించి ఇంటికి రప్పించారు.
Read More: సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు భారీ సబ్సిడీ.. పీఎం సూర్యఘర్ స్కీమ్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్..
ఈ నేపథ్యంలో ఇంకి వచ్చిన పుష్పేంద్రను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. కుటంబసభ్యులతో పాటు ఇతర బంధువులతో కలిసి ప్లాన్ ప్రకారం ఇంటికి వచ్చిన ఆ యువకుడిని దారుణంగా చంపేశారు. అనంతరం కారులో మృతదేహాన్ని తీసుకువెళ్లి దహనం చేశారు.
మథర జిల్లాలో ఈ కాలిపోయిన ఈ కారును పోలీసులు సోమవారం గుర్తించారు. పరిశీలించగా కారులో మృతదేహాన్ని గమనించారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఈ విషయాలన్ని బయటపడ్డాయి.
పోలీసులు యువతితో పాటు ఇందుకు కారణమైన కుటుంబసభ్యలను అదుపులోకి తీసుకున్నారు. ఆమె తండ్రి అవదేశ్ మాత్రం పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. దర్యాప్తు వేగంతం చేసి అవదేశ్ త్వరలో పట్టుకుంటాం అని సీనియర్ సూపరింటెండెంట్ శైలేష్ కుమార్ పేర్కొన్నారు.