BigTV English

Bomb Threat: దేశంలో పలు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు.. భద్రత కట్టుదిట్టం..

Bomb Threat: దేశంలో పలు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు.. భద్రత కట్టుదిట్టం..

Bomb Threat To Patna vadodara Coimbatore Jaipur Airports: దేశంలో మరోసారి బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ కలకలం సృష్టించాయి. బీహార్‌లోని పాట్నా విమానాశ్రయ అధికారులకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్‌లు అందడంతో మంగళవారం ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో భయాందోళన నెలకొంది. మంగళవారం మధ్యాహ్నం 1:10 గంటలకు పాట్నా విమానాశ్రయం డైరెక్టర్‌కు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. దీంతో ఎయిర్ పోర్టు అంతటా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పాట్నా ఎయిర్ పోర్ట్ డైరక్టర్ తెలిపారు.


కాగా మంగళవారం ఇది రెండో బాంబు బెదిరింపు. అంతకుముందు గుజరాత్‌లోని వడోదరా విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. విమానాశ్రయ అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. పోలీసులను సంప్రదించి విమానాశ్రయ ఆవరణలో భద్రతను పెంచారు. బెదిరింపు ఈమెయిల్‌ను పంపిన వ్యక్తిని ట్రాక్ చేయడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఇక వడోదర సైబర్ క్రైమ్ బెదిరింపు ఈ-మెయిల్ మూలాన్ని వెతుకుతోంది.

మంగళవారం, బూటకపు బాంబు బెదిరింపు చెన్నై నుంచి దుబాయ్ వెళ్లే విమానం ఆలస్యానికి కారణమైంది. ఈ విమానంలో 268 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు రావడంతో భద్రతా సంస్థలు విమానాన్ని క్షుణ్నంగా తనిఖీ చేశాయి. ఇదిలా ఉండగా సోమవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్తున్న విమానానికి మరో బాంబు బెదిరింపు వచ్చింది. జూన్ 17 ఉదయం 9:35 గంటలకు, ఢిల్లీ- దుబాయ్ ఫ్లైట్‌లో బాంబు ఉందని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) ఆఫీసు, IGI ఎయిర్‌పోర్ట్‌కు ఈమెయిల్ వచ్చిందని పోలీసులు తెలిపారు.


కోయంబత్తూరు, జైపూర్ ఎయిర్ పోర్టులకు కూడా బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఎయిర్ పోర్టు పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.

Also Read: ఢిల్లీలో హై అలర్ట్.. కేంద్ర హోంశాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు

గత వారం ఢిల్లీలోని పలు మ్యూజియంలకు బాంబు బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. కాగా అదంతా ఫేక్ అని తేల్చేసారు అధికారులు. ఢిల్లీలోని రైల్వే మ్యూజియంతోపాటు దాదాపు 10-15 మ్యూజియంలకు ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Related News

PM Kisan Samman Nidhi: ఈ రాష్ట్రాల్లో పీఎం కిసాన్ డబ్బులు విడుదల.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడంటే?

Idli Google Doodle: వేడి వేడి ఇడ్లీ.. నోరూరిస్తోన్న గూగుల్ డూడుల్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

EPFO Tagline Contest: ఈపీఎఫ్ఓ నుంచి రూ.21 వేల బహుమతి.. ఇలా చేస్తే చాలు?

Earthquake: వణికిన ఫిలిప్పీన్స్.. 7.6 తీవ్రతతో భారీ భూకంపం

UP Governor: యూపీ గవర్నర్ వార్నింగ్.. సహజీవనం వద్దు, తేడా వస్తే 50 ముక్కలవుతారు

Tata Group: టాటా గ్రూప్‌లో కుంపటి రాజేస్తున్న ఆధిపత్య పోరు.. రంగంలోకి కేంద్రం..

Donald Trump: ప్రెసిడెంట్ ట్రంప్‌నకు యూఎస్ చట్టసభ సభ్యులు లేఖ

Narendra Modi: ఓటమి తెలియని నాయకుడు.. కష్టపడి పని చేసి, ప్రపంచానికి చూపించిన లీడర్..

Big Stories

×