BigTV English

Petrol price in India: లీటర్ పెట్రోల్ రెండు రూపాయలే.. ఇదేం రేటు బాబోయ్!

Petrol price in India: లీటర్ పెట్రోల్ రెండు రూపాయలే.. ఇదేం రేటు బాబోయ్!

Petrol price in India: మనవాళ్లకు పెట్రోల్ ట్యాంక్ నింపితే చేతిలో డబ్బులు మిగిలిపోవడం అరుదు! నిత్యం పెరుగుతున్న ధరలతో ప్రజలు చింతించాల్సిన స్థితి. అయితే ఇదే సమయంలో ప్రపంచంలోని కొన్ని దేశాల్లో లీటర్ పెట్రోల్ ధర కేవలం రెండు రూపాయలు మాత్రమే ఉండటం వింటే ఆశ్చర్యం కలగకమానదు. ఖచ్చితంగా ఇది నిజం. అక్కడి పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు దీన్ని సాధ్యం చేశాయి.


మన దగ్గరే ఎందుకంత ఎక్కువ?
మనదేశంలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర సగటున రూ. 100కి పైగానే ఉంది. కొన్ని నగరాల్లో ఇది రూ. 110 కూడా దాటుతోంది. దీని ప్రధాన కారణాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వసూలు చేసే పన్నులు. ఇక రవాణా వ్యయం, నిల్వ ఖర్చులు కూడా దానికి తోడు. ఈ ధరల్లో సగభాగం దాదాపు పన్నుల రూపంలోనే వెళ్తుంది అంటే మనం చెల్లించేది కేవలం ఇంధన ఖర్చు కాదు.. పన్నులు కూడా అంటూ మనం అర్థం చేసుకోవచ్చు.

పక్క దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది?
మన పక్కనే ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కూడా పెట్రోల్ మనకంటే తక్కువ ధరలకే లభిస్తోంది. ఉదాహరణకు పాకిస్తాన్‌లో లీటర్‌కి సగటుగా రూ. 80. బంగ్లాదేశ్‌లో రూ. 85. మనకన్నా తక్కువే కదా!
అమెరికాలోనూ పెట్రోల్ ధర తక్కువే.. దాదాపు రూ. 79.4. చైనాలో రూ. 94.5. రష్యాలో రూ. 67.1 మాత్రమే. ఈ దేశాలు తమ దేశాల్లోనే ఆయిల్‌ను ఉత్పత్తి చేసుకోవడం వల్ల లేదా సరఫరా చైన్‌ను సమర్థవంతంగా నిర్వహించడం వల్ల ఈ ధరల్ని నియంత్రణలో ఉంచగలుగుతున్నాయి.


Also Read: Sarla Aviation Amaravati: ఏపీకి సూపర్ క్రెడిట్.. ఇకపై విమానాల తయారీ ఇక్కడే!

ఈ దేశంలో మాత్రం.. వెరీ చీప్!
ఇక్కడే వస్తుంది అసలైన షాకింగ్ విషయం. ఓ దేశంలో లీటర్ పెట్రోల్ ధర కేవలం రూ. 2.4 మాత్రమే ఉంది! అవును… కేవలం రెండు రూపాయల 40 పైసలు! మీరు చదివింది నిజం. ఈ దేశం పేరు ఇరాన్. అక్కడ ప్రభుత్వమే ఆయిల్‌ను నేరుగా ఉత్పత్తి చేస్తోంది. అంతే కాదు, సామాన్య ప్రజలకు ఇంధనం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో భారీగా సబ్సిడీలు ఇస్తోంది.

ఇది ప్రజలకు ఒక తీపి వరంగా మారింది. కానీ దీని వెనుక ఉన్న వ్యయ భారం మాత్రం ప్రభుత్వానిదే. అయినా వారు చౌకగా ఇంధనం ఇచ్చేందుకు వెనకడుగు వేయడం లేదు.

నిజమైన అభివృద్ధి అంటే ఇదే కదా?
పెట్రోల్ ధరలు మితమైనపుడు ప్రజల జీవన నాణ్యత పెరుగుతుంది. రవాణా సులభమవుతుంది. దాని ప్రభావం వినియోగదారులపై తక్కువగా పడుతుంది. అయితే మన దేశంలో మాత్రం బలం పన్నుల మీదే ఉండటం వల్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

ఈ నేపథ్యంలో చాలా దేశాలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వేస్తున్నాయి. బదులుగా జీవనశైలిని మార్చుకోవడమే తమ లక్ష్యంగా పెట్టుకుంటున్నాయి. మనం కూడా ఆ దిశగా ఆలోచించాల్సిన సమయం ఇది.

మన దేశ ప్రజల జేబులో చిల్లర మిగలాలంటే, ఇంధనంపై ఉన్న పన్నులను సమీక్షించాల్సిన అవసరం ఉందని పలువురి అభిప్రాయం. ఏది ఏమైనా కేవలం రెండు రూపాయలకు ఆ దేశంలో పెట్రోల్ లభించడం గొప్ప విషయమే కదా మరి!

Related News

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Big Stories

×