E-Paper
Advertisement

Modi : ఈజిప్టులో మోదీకి అరుదైన గౌరవం.. ఆ దేశ అత్యున్నత పురస్కారం ప్రదానం..

Modi : ఈజిప్టులో మోదీకి అరుదైన గౌరవం.. ఆ దేశ అత్యున్నత పురస్కారం ప్రదానం..

Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. ఈజిప్టు అత్యున్నత పురస్కారం ఆర్డర్‌ ఆఫ్‌ ది నైల్‌ అందుకున్నారు. ఆ దేశ పర్యటనకు వెళ్లిన మోదీకి ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసి ఈ పురస్కారం ప్రదానం చేశారు. 1915 నుంచి ఈ పురస్కారాన్ని.. ప్రజలకు విశేష సేవలందించిన వివిధ దేశాల అధినేతలు, రాజులు, ఉపాధ్యక్షులకు అందిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో మోదీకి ఇది 13వ పురస్కారం.

ఈజిప్టులోని పురాతన మసీదును మోదీ సందర్శించారు. మతపెద్దలతో కలిసి అల్‌- హకీం- మసీదు మొత్తం తిరిగారు. ప్రార్థనా మందిరం గోడలు, తలుపులపై చెక్కిన శాసనాలను శ్రద్ధగా పరిశీలించారు. 11వ శతాబ్దంలో ఈ మసీదును నిర్మించారు. ఇటీవల పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ పనుల వివరాలను దావూదీ బోహ్రా వర్గానికి చెందిన మతపెద్దలు మోదీకి వివరించారు.

11వ శతాబ్దంలో కైరోలోనే అతిపెద్ద మసీదుల్లో అల్‌- హకీం- మసీదు ఒకటి. వెయ్యి ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మసీదు 13,560 చదరపు మీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ప్రధాన ప్రార్థనా మందిరం 5 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీనిని అరబ్‌ మూలాలున్న ఇస్మాయిలీ షియా వర్గానికి చెందిన దావూదీ బోహ్రా వర్గం వారు ఇటీవల పునరుద్ధరించారు. ఈజిప్టుకు చెందిన ఈ దావూదీ బోహ్రాల్లో కొంత మంది తొలుత యెమెన్‌ వలస వెళ్లారు. అక్కడ నుంచి భారత్‌కు వచ్చి స్థిరపడ్డారు. భారత్‌లో ఈ వర్గం జనాభా సుమారు 5 లక్షల ఉంటుంది.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×