E-Paper
Advertisement

BJP : తెలంగాణపై బీజేపీ ఫోకస్.. అధికారమే లక్ష్యం : జేపీ నడ్డా

BJP : తెలంగాణపై బీజేపీ ఫోకస్.. అధికారమే లక్ష్యం : జేపీ నడ్డా
Advertisement

JP Nadda latest news(Political news in telangana): కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ డీలా పడింది. పార్టీలో చేరేందుకు ఇతర పార్టీ నేతలెవరూ ఆసక్తిగా లేరు. మరోవైపు కాషాయ దళంలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ముఖ్యనేతలు వర్గాలుగా విడిపోయారు. పార్టీ నుంచి కొందరు కీలక నేతలు కాంగ్రెస్ లోకి వెళతారనే ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. కాషాయ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు వచ్చారు.

హైదరాబాద్ నోవాటెల్‌లో రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలతో జేపీ నడ్డా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మెల్యే రఘునందరావు, విజయశాంతి, వివేక్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌రావు పాల్గొన్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ లైన్‌ దాటి ఎవరూ మాట్లాడొద్దని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణలో అధికారమే టార్గెట్ పనిచేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ తో రాజీలేదని తేల్చిచెప్పారు.

Advertisement

సంపర్క్‌ సే సమర్థన్‌ కార్యక్రమంలో భాగంగా రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ తో జేపీ నడ్డా సమావేశమయ్యారు. 9 ఏళ్ల మోదీ పాలనపై రూపొందించిన బుక్ ను నాగేశ్వర్ కు అందించారు.

జేపీ నడ్డాతో భేటీ వివరాలను ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ వెల్లడించారు. మోదీ పాలన గురించి నడ్డా వివరించారని తెలిపారు. వివిధ అంశాలపై చర్చించామన్నారు. తన అభిప్రాయాలను జేపీ నడ్డాతో పంచుకున్నానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భేటీలు శుభపరిణామంగా పేర్కొన్నారు. సిద్ధాంతాలు వేరైనా అభిప్రాయాలు పంచుకోవడం మంచిదని నాగేశ్వర్‌ అభిప్రాయపడ్డారు.

Tags

Related News

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

Big Stories

Advertisement
×