E-Paper
Advertisement

PM Modi First Sign: ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ.. తొలిసంతకం ఆ ఫైల్ పైనే..!

PM Modi First Sign: ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ.. తొలిసంతకం ఆ ఫైల్ పైనే..!

PM Modi First Signed on PM Kisan File: ఆదివారం సాయంత్రం మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ.. సోమవారం పార్లమెంట్ సౌత్ బ్లాక్ లోని పీఎంఓలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీయే సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. మోదీ పీఎం కిసాన్ నిధుల విడుదల ఫైల్ పై తొలి సంతకం చేశారు.

మోదీ సంతకంతో.. దేశవ్యాప్తంగా ఉన్న 9 కోట్ల 30 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. మొత్తం రూ.20 వేల కోట్ల నిధులు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి కట్టుబడి ఉందన్నారు. రైతులు, వ్యవసాయ రంగాలను అభివృద్ధి చేస్తామని, భవిష్యత్తులో దీనికోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతు సంక్షేమానికే ప్రాధాన్యతనిస్తామన్న ప్రధాని.. అందులో భాగంగానే తొలిసంతకం రైతు సంక్షేమ ఫైల్ పై చేసినట్లు పేర్కొన్నారు.

ఆదివారం మోదీ కేబినెట్ లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ఉన్నారు. వారిలో ముగ్గురు ఏపీ, ఇద్దరు తెలంగాణ ఎంపీలు. ఏపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ.. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారాలు చేశారు. వీరికి అధిష్టానం ఇంకా శాఖలు కేటాయించాల్సి ఉంది. అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు.. ముగ్గురు మంత్రులకు ఏయే శాఖలు కేటాయిస్తుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Also Read: NEET-UG 2024 Row: నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశం.. ఎన్టీయేకు సుప్రీం నోటీసులు.. 

Tags

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×