E-Paper
Advertisement

PM Modi on Mahaveer Jayanti: మహవీర్ జయంతి.. 2550వ నిర్వాణ మహోత్సవాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..!

PM Modi on Mahaveer Jayanti: మహవీర్ జయంతి.. 2550వ నిర్వాణ మహోత్సవాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..!
Advertisement

PM Modi Inaugurates 2550th Bhagwan Mahaveer Nirvana Mahotsav: మహావీర్ జయంతి సందర్భంగా ఆదివారం దేశ రాజధానిలోని భారత్ మండపంలో 2550వ భగవాన్ మహావీర్ నిర్వాణ మహోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్మారక స్టాంపును, నాణేన్ని కూడా విడుదల చేశారు.

అంతకుముందు, ప్రధాని మోదీ మహావీర్ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు, భగవాన్ మహావీర్ శాంతి, సద్భావన సందేశం ‘విక్షిత్ భారత్’ నిర్మాణంలో దేశానికి ప్రేరణ అని అన్నారు. “మహావీర్ జయంతి శుభ సందర్భంగా దేశంలోని కుటుంబ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు.. భగవాన్ మహావీర్ శాంతి, సంయమనం సామరస్య సందేశం ‘విక్షిత్ భారత్’ నిర్మాణంలో దేశానికి స్ఫూర్తినిస్తుంది” అని ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.

Advertisement

Also Read: పరీక్షలో ఫేలయ్యి.. ఫుల్లు ఫేమసయ్యాడు

మహావీర్ జయంతి అంటే ఏమిటి?
Advertisement

మహావీర్ జయంతి జైనమత స్థాపకుడు జన్మదినాన్ని సూచిస్తుంది. జైన సంఘం శాంతి, సామరస్యాన్ని పాటించడానికి.. జైనమత 24వ తీర్థంకరుడైన మహావీరుడి బోధనలను వ్యాప్తి చేయడానికి ఈ పండుగను జరుపుకుంటుంది. ఈ పండుగ జైన క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలోని 13వ రోజున వస్తుంది – ఈ సంవత్సరం దీనిని ఏప్రిల్ 21న జరుపుకుంటారు.

రథంపై మహావీర్ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్తూ.. దారిలో మతపరమైన పాటలు పారాయణం చేస్తూ మహావీర్ జయంతిని జరుపుకుంటారు. జైనులు కూడా దానధర్మాలు చేయడం, ప్రార్థనలు చేయడం, ఉపవాసాలు పాటించడం, జైన దేవాలయాలను సందర్శించడం, సామూహిక ప్రార్థనలు చేయడం, ధ్యానం చేయడం వంటివి ఈ రోజున చేస్తారు. జైన మతస్థులు ఎక్కువగా సాత్విక ఆహారం తింటారు. ఇందులో ఉల్లిపాయ లేదా వెల్లుల్లి లేకుండా తయారు చేసిన శాఖాహారం భోజనం ఉంటుంది.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×