Husband Poured Petrol On Wife and Set Her On Fire: ప్రేమించి పెళ్లి చేసుకున్న మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడో భర్త. వరంగల్లోని చార్ బౌలి ఏరియాలో ఈ ఘటన జరిగింది. ఈమధ్యే మజార్ను ప్రేమపెళ్లి చేసుకుంది ఆస్మా. భార్యా భర్తలు ఇద్దరు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
వివాహం జరిగి మూడు నెలలు గడవకముందే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. మజార్ ఎక్కువగా మధ్యానికి బానిసవడంతో వారి మధ్య గొడవలు చిలికి చిలికి గాలివానలాగా మారాయి. దీంతో వీరిద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణతో ఆగ్రహించిన భర్త.. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు మజార్.
Also Read: పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి.. ఇద్దరు మృతి!
తీవ్ర గాయాలతో విలవిల్లాడుతున్న ఆమెను.. MGM ఆస్పత్రిలో చేర్పించాడు. తర్వాత పరారయ్యాడు. తన భర్త మధ్యం సేవించి రోజు ఆమెను చిత్రహింసలు పెడతాడని, చిన్న విషయానికే అనుమానం పెంచుకుంటూ రోజూ కొడతాడని చెప్పుకొచ్చింది. ఈ పరిస్థితికి అతడే కారణమంటూ ఆస్మా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.