Fastest Metro India: దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో రైలు సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లో మీరట్లో ప్రారంభించారు. గంటకు 120 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ మెట్రో భారత్లో రవాణా వ్యవస్థ వేగాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లనుంది. మీరట్ దక్షిణ స్టేషన్ నుంచి మోదీపురం డిపో వరకు సుమారు 23 కిలోమీటర్ల మేర ఉన్న ఈ మార్గాన్ని ప్రధాని జాతికి అంకితం చేశారు. కేవలం 30 నిమిషాల లోపు వ్యవధిలోనే ఈ గమ్యస్థానాన్ని చేరుకునేలా ఈ మెట్రోను రూపొందించారు.
ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి స్వయంగా మెట్రోలో ప్రయాణించారు. శతాబ్ది నగర్ స్టేషన్ నుంచి మీరట్ సౌత్ స్టేషన్ వరకు వీరు ప్రయాణించి ప్రయాణికులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. నవీన సాంకేతికతతో కూడిన ఈ మెట్రో రైలు ప్రయాణ అనుభవం అద్భుతంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఇదే వేదికగా ప్రధాని మోదీ ‘నమో భారత్’ (Namo Bharat) రైలు సర్వీసులను కూడా ప్రారంభించడం విశేషం. రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) ప్రాజెక్టులో భాగంగా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ప్రధాని మోదీ ఈ పర్యటన సందర్భంగా మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పనలో దూసుకుపోతోందని కొనియాడారు. వేగవంతమైన మెట్రో సేవలు సామాన్యుల జీవితాల్లో పెను మార్పులు తీసుకువస్తాయని ఆయన ఆకాంక్షించారు. మెట్రో రాకతో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్.. వాణిజ్య రంగాలు మరింత పుంజుకునే అవకాశం ఉంది. మీరట్ ప్రజల చిరకాల స్వప్నం ఈరోజు సాకారమైందని సీఎం యోగి ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ కారిడార్ను మరింత విస్తరించి మరిన్ని నగరాలను అనుసంధానించే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ ప్రాజెక్టు వల్ల మీరట్ వాసుల ప్రయాణ కష్టాలు తీరడమే కాకుండా ఢిల్లీ-మీరట్ మధ్య అనుసంధానం మరింత బలపడనుంది. సాధారణ మెట్రో రైళ్ల కంటే ఇవి అత్యంత వేగంగా ప్రయాణించడం వల్ల సమయం భారీగా ఆదా అవుతుంది. అత్యాధునిక భద్రతా ప్రమాణాలు.. సౌకర్యవంతమైన సీటింగ్.. ఆకర్షణీయమైన డిజైన్లతో ఈ రైళ్లను తీర్చిదిద్దారు.
VIDEO | Meerut, Uttar Pradesh: PM Narendra Modi (@narendramodi) undertakes a metro ride to Meerut South station.
(Source: Third Party)
(Full video available on https://t.co/n147TvrpG7) pic.twitter.com/VCgHxcJtIF
— Press Trust of India (@PTI_News) February 22, 2026
Read Also: Hyderabad Water Board: గ్రేటర్లో నీటి వృథా ఫిర్యాదుల స్వీకరణకు.. ప్రత్యేక మొబైల్ యాప్..!