BJP President Arrest: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ తార్నాకలోని ఆయన నివాసం వద్ద ఆయనను ఆదివారం అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఇరు వర్గాల మధ్య ఇటీవల ఘర్షణ జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు అక్కడికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేశారు. రామచందర్ రావు బాన్సువాడ వెళ్లేందుకు ప్రయత్నించడగా పోలీసుల ఆయనను అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. దీంతో రామచందర్రావు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
‘పోలీసులను ఉసిగొలిపి అక్రమ అరెస్టులు చేయిస్తూ ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతుంది కాంగ్రెస్ పార్టీ. సెక్యులరిజం పేరుతో ఎంఐఎంకి తొత్తులా వ్యవహరిస్తూ హిందువులపైనే దాడులు చేస్తున్నారా? ఇక చూస్తూ ఊరుకోం.. బీజేపీ కార్యకర్తలపై, హిందువులపై దాడి చేస్తే సహించబోం’- ఎన్. రామచందర్ రావు
“కామారెడ్డిలో ఎమ్మెల్యేపై దాడి, బాన్సువాడిలో దాడులను ఖండిస్తూ.. బాధితులను పరామర్శించేందుకు నేను బయలుదేరితే నన్ను అరెస్టు చేశారు. మా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తే ఊరుకునేది లేదు. ఇప్పటికే బాన్సువాడలో 80 మందిని అన్యాయంగా అరెస్టు చేశారు. ఈ ప్రభుత్వం ఎంఐఎం చేతిలో ఉంది. నిరసన తెలిపేందుకు బంద్ ప్రకటిస్తే.. 144 సెక్షన్ పెట్టి బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేస్తారు. ఒక్కరినైనా ఎంఐఎం కార్యకర్తను అరెస్టు చేశారా?. పోలీసులు ప్రభుత్వ తొత్తులుగా మారారు. కాంగ్రెస్, ఎంఐఎం మాటలు విని బీజేపీ, హిందూ సంఘాల నేతలను వేధిస్తున్నారు.” – రామ చందర్ రావు
Also Read:వారి వల్లే బీజేపీకి ప్లస్..కాంగ్రెస్కు మైనస్..బీ కేర్ ఫుల్!