E-Paper
Advertisement

PM Modi: తల్లిని కోల్పోయిన బాధలోనూ.. పీఎం మోదీ ఆన్ డ్యూటీ..

PM Modi: తల్లిని కోల్పోయిన బాధలోనూ.. పీఎం మోదీ ఆన్ డ్యూటీ..
Advertisement

PM Modi: తల్లి చనిపోయారు. పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. తల్లి పాడె కూడా మోశారు. అంత్యక్రియల్లో పాల్గొన్నారు. గుండెల నిండా విషాదం. మది నిండా అమ్మ ఆలోచనలు. మరొకరైతే కోలుకోవడానికి చాలాకాలమే పడుతుంది. కానీ, మోదీ మాత్రం అంత ఆవేదనలోనూ ప్రధానిగా తన విధులను మర్చిపోలేదు. బాధ దిగమింగుతూనే.. గుజరాత్ లో నుంచే బెంగాల్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను వర్చువల్ గా ప్రారంభించారు. పని పట్ల నిబద్ధతను మరోసారి నిరూపించుకున్నారు.

షెడ్యూల్ ప్రకారం పీఎం మోదీ కోల్ కతాలో పర్యటించాల్సి ఉంది. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సహా పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభానికి గతంలోనే షెడ్యూల్‌ ఖరారైంది. కానీ, మోదీ తల్లి హీరాబెన్ అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరడంతో.. తల్లిని చూసేందుకు హుటాహుటిన ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్లారు మోదీ. శుక్రవారం ఉదయం హీరాబెన్ మరణంతో అక్కడే ఉండిపోయారు. దీంతో శుక్రవారం నాటి కోల్ కతా పర్యటన రద్దు అయింది.

Advertisement

అయితే, తాను బెంగాల్ కు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా.. వీడియో కాన్షరెన్స్ లో షెడ్యూల్ ప్రకారమే కార్యక్రమాలు నిర్వహించారు ప్రధాని మోదీ. హవుడా, న్యూ జల్‌పయ్‌గురిని కలిపే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను మోదీ వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సైతం భాగమయ్యారు.

తాను బెంగాల్‌కు రావాల్సి ఉందని.. కానీ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు బెంగాల్‌ వాసులు తనను క్షమించాలని కోరారు.

Advertisement

మరోవైపు, ప్రధాని మోదీకి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సానుభూతి ప్రకటించారు. ‘‘మాతృమూర్తి మరణం విచారకరం. మీకు తీరని లోటే. దుఃఖం నుంచి బయటపడేలా ఆ భగవంతుడు మీకు స్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. దయచేసి కాస్త విశ్రాంతి తీసుకోండి మోదీజీ’’ అని సీఎం మమతా విచారం వ్యక్తం చేశారు.

Related News

ఆసుపత్రి నుంచే సోనమ్ వాంగ్‌చుక్ సంచలన లేఖ.. ఢిల్లీ హైకోర్టు షాకింగ్ తీర్పుతో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×