BigTV English

Ambani Wedding Pop Singer: అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో పాప్‌ సింగర్, రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా..

Ambani Wedding Pop Singer: అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో పాప్‌ సింగర్, రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా..

Pop Singer rihanna in Ambani's pre-wedding


Pop Singer Remuneration in Ambani’s pre-wedding(Celebrity news today): ప్రపంచ కుబేరుల జాబితాలో తనకంటూ ఓ మార్క్‌ని క్రియేట్ చేసుకుని సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఒకరు. అంబానీ చిన్నకొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ఫ్రీ వెడ్డింగ్‌ సంబరాలు అంబరాన్నంటాయి. ఇప్పటికే వీరి వేడుకలకు దేశంలోని ప్రముఖులు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరుగనుంది. ఇక్కడే ఈ వేడుకలను జరుపుకోవడానికి మెయిన్‌ రీజన్. అనంత్‌ అంబానీ గుజరాత్‌లోనే పుట్టాడని.. అందుకే తన పెళ్లి వేడుకలను ఇక్కడ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.ఇక ఈ వేడుకలో మెయిన్‌గా చెప్పుకోవాల్సింది పాప్‌ సింగర్‌ రిహన్న..

ప్రపంచ పాప్‌ సింగర్‌లో రిహన్న ఒకరు. ఈ రిహన్న ఇప్పుడు జాంనగర్‌లో ఉంది. ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌లో స్పెషల్‌ షో చేయనున్నారు. నాలుగు గంటల పాటు తన సంగీతంతో అతిథులను మంత్రముగ్థులను చేయనున్నారు. ఇందుకోసం ఆమె అక్షరాల రూ. 85 కోట్లను అంబానీ నుండి అందుకుంటున్నారు. అంతేకాకుండా ఆమె విదేశాల నుండి రావడానికి ఆమె కోసం ఓ ప్రత్యేక విమానం.. ఆ విమానంలో మూడు ట్రక్కుల్లో వచ్చిన ఎక్విప్‌మెంట్‌, మూడురోజుల పాటు ఆమె జాంనగర్‌లో ఉండటం కోసం ఆమె టీంకి ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. అందుకే వీరందరి కోసం ఇంతలా ఖర్చు చేయబోతున్నారట మన అంబానీ. శ్రోతలను ఆహ్లాదపరిచేందుకు ఆమె సైతం అన్ని విధాలుగా తన ఏర్పాట్లను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.


Read More: అయ్యబాబోయ్, అంబానీ కొడుకు పెళ్లికి అన్నికోట్లా.?

రిహన్న పాటలకు ప్రపంచమంతా ఉర్రూతలూగుతూ చిందులు వేసింది. 2020-21లో ఎంతోమంది భారతీయులు ఆమె టాలెంట్ గురించి తెలుసుకున్నారు. వాస్తవానికి, రిహన్న ఆ సమయంలో భారతదేశంలో జరుగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుగా X (అప్పటి ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో రిహానాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా సరే కొంతమంది ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా ఆమె అప్పుడే వెలుగులోకి రావడంతో అందరి నోట రిహన్న పాట అన్నట్లుగా మారింది.

ఇక ఈ వేడుకలకు దేశంలోని నలుమూలల నుండి ప్రముఖుల రాకతో జామ్‌నగర్ అంతా సందడి వాతావరణం నెలకొంది. టీమీండియా మాజీ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ దంపతులు, క్రికెటర్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, అఫ్గాన్ క్రికెటర్ రషీద్‌ఖాన్, విండీస్ క్రికెటర్ బ్రావో, జహీర్‌ఖాన్ దంపతులు, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్​ జామ్‌నగర్‌కు ఇప్పటికే చేరుకున్నారు. అలాగే డీఎల్ఎఫ్‌ సీఈఓ కుశాల్‌ పాల్‌సింగ్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో పనిచేసే ముఖ్య అధికారులు సైతం ఇక్కడికి చేరుకున్నారు. ఏదేమైనా దేశంలోని ప్రముఖులంతా ఒక్కచోట సందడి చేయడంతో కెమెరాల చూపంతా గుజరాత్‌ వైపే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

Tags

Related News

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Big Stories

×