E-Paper
Advertisement

Priyanka Gandhi: లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయకపోవడానికి కారణం ఏంటంటే?

Priyanka Gandhi: లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయకపోవడానికి కారణం ఏంటంటే?

Priyanka Gandhi: లోక్ సభ ఎన్నికల్లో తాను ఎందుకు పోటీ చేయలేదనే అంశంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వివరణ ఇచ్చారు. దేశ వ్యాప్తంగా పార్టీ తరపున ప్రచారం చేసేందుకే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. సోదరుడు రాహుల్ గాంధీతో పాటు తాను కూడా పోటీ చేస్తే  బీజేపీకి లాభం చేకూరుతుందని ప్రియాంక గాంధీ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు అంశాలకు సంబంధించి వివరణ ఇచ్చారు.

గత 15 ఏళ్లుగా తాను రాయ్ బరేలీలో ప్రచారం చేస్తున్నానని ప్రియాంక గాంధీ చెప్పారు. గాంధీ కుటుంబానికి రాయ్ బరేలీతో ఎంతో అనుబంధం ఉందన్నారు. అందుకే తాము ప్రజలతో కలిసి మాట్లాడాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. రిమోట్ కంట్రోల్ ద్వారా రాయ్ బరేలి ఎన్నికలను గెలవలేరని ఎద్దేవా చేశారు.

తాను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే కనీసం 15 రోజులు తన నియోజకవర్గంలో ప్రచారం చేసుకునేందుకు సమయం కేటాయించాల్సి వచ్చేదని తెలిపారు. అప్పుడు దేశమంతా ప్రచారం చేయడానికి వీలు ఉండేది కాదని అన్నారు. అయితే భవిష్యత్తులో పోటీ చేస్తారా లేదా అన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.

ఇదిలా ఉంటే ఎన్నికల్లో పోటీ చేయాలని తాను ఎప్పుడూ అనుకోలేదని ప్రియాంక గాంధీ చెప్పారు. పార్టీ కోసం ప్రజలు తాను ఏది చేయాలని కోరితే అదే చేస్తానని తెలిపారు. తాను ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

Also Read: భావోద్వేగానికి గురైన రాహుల్ గాంధీ

మరో వైపు అమేథీ, రాయ్ బరేలీలో పోటీ నుంచి పారిపోతున్నారంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆమె స్పందించారు. అమేథీ, రాయ్ బరేలీలను కాంగ్రెస్ వదిలి పెట్టదని తెలిపారు. గుజరాత్ లోని వడోదరలో మోదీ ఎందుకు పోటీ చేయడం లేదని ప్రియాంక ప్రశ్నించారు. గుజరాత్ నుంచి ఆయన పారి పోయారా అని అన్నారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×